కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం, డాక్టర్ పోస్టులు భర్తీ, పారా మెడికల్ సిబ్బంది నియామకం అంశాలపై సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులతో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలన్నదే ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని... ఆ దిశగానే చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు జరగాలని సూచించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలు సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ఉదృతంగా చేపట్టడానికి గ్రామ సచివాలయాలు యూనిట్ గా తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.
కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం, డాక్టర్ పోస్టులు భర్తీ, పారా మెడికల్ సిబ్బంది నియామకం అంశాలపై సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులతో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (కొవిడ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర , ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఈవో డాక్టర్ మల్లికార్జున, ప్రజా ఆరోగ్య శాఖ సంచాలకురాలు డాక్టర్ గీతా ప్రసాదిని, ఎపివివిపి కమీషనర్ డాక్టర్ రామకృష్ణ, డిఎంఇ డాక్టర్ రాఘవేంద్ర రావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ, గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్న వారికి సత్వరమే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు. 45సంవత్సరాల పైబడి, ధీర్గకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికీ వ్యాక్సిన్ వెంటనే చేయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. వ్యాక్సినేషన్ పై సమగ్ర కార్యాచరణతో సిద్ధం కావాలని అధికారులకు మంత్రి ఆళ్ల నాని అదేశించారు. పూర్తి స్థాయిలో నూటికి నూరు శాతం ఆర్టిపిసిఆర్ పరీక్షలు జరగడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అదేశించారు.
read more 24 గంటల్లో 218 కరోనా కేసులు: ఏపీలో మొత్తం 8,92,269కి చేరిక
''కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించడం కన్నా.. ఆ వైరస్ నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో ఈ నెల 18వ తేది వరకు 13లక్షల 80వేల 537మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటివరకు హెల్త్ కేర్ వర్కర్స్ కి మొదటి డోస్ 3లక్షల 22వేల 102మందికి, రెండవ డోస్ ఒక లక్ష 88వేల 407మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. ఫ్రంట్ లైన్ వర్కర్స్ మొదటి డోస్ 3లక్షల 40వేల 620మందికి, రెండొవ డోస్ 68వేల 345మందివ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది. 60సంవత్సరాల వయసు కలిగిన వారు 2లక్షల 81వేల 187మంది, 45సంవత్సరాల నుండి 59సంవత్సరాల వరకు 98వేల 550మంది వ్యాక్సిన్ తీసుకున్నారు'' అని ఆళ్ల నాని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న వైద్యులు పోస్టులు భర్తీపై దృష్టి పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులకు మంత్రి ఆళ్ల నాని అదేశించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నెట్ వర్క్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ మరింత సమర్దవంతంగా అమలు జరగడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు.
