విశాఖలో కేరళకు చెందిన మెడికో ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం కలకలం రేపుతోంది. జీవితంలో ఓడిపోయానంటూ ఓ సూసైడ్ నోట్ రాసి లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
విశాఖలో కేరళకు చెందిన మెడికో ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం కలకలం రేపుతోంది. జీవితంలో ఓడిపోయానంటూ ఓ సూసైడ్ నోట్ రాసి లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. దాబా గార్డెన్స్లోని ఓ లాడ్జిలో కేరళ మెడికో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని రమేశ్ కృష్టగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

