Asianet News TeluguAsianet News Telugu

అమరావతిలో అసైన్డ్ భూముల ఇష్యూ:సీఐడీ కార్యాలయానికి ఆళ్ల

ఏపీ సీఐడీ కార్యాలయానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం నాడు ఉదయం హాజరయ్యారు. 
 

Mangalagiri MLA Alla Ramakrishna Reddy Reaches to AP CID office lns
Author
Vijayawada, First Published Mar 18, 2021, 11:21 AM IST

విజయవాడ: ఏపీ సీఐడీ కార్యాలయానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం నాడు ఉదయం హాజరయ్యారు. 

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహరంలో తన వద్ద ఉన్న  ఆధారాలను అందించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ ఈ నెల 17వ తేదీన నోటీసులు జారీ చేసింది.ఈ నోటీసులు తీసుకొన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇవాళ ఉదయం సీఐడీ కార్యాలయానికి చేరుకొన్నారు. తన వద్ద ఉన్న ఆధారాలను సీఐడీ అందించనున్నట్టుగా ఆయన చెప్పారు.

ఈ ఏడాది గత మాసంలో అసైన్డ్ భూముల వ్యవహారంలో అవకతవకలు చోటు చేసుకొన్నాయని  ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు  నోటీసులు జారీ చేశారు.ఈ నోటీసులు అందుకొన్న  చంద్రబాబునాయుడు ఈ విషయమై కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

ఇదే విషయమై మాజీ మంత్రి పి. నారాయణకు కూడ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios