దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లి జంట హత్యల కేసులో నిందితులు సోమవారం విశాఖ మెంటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నారు. వారిని చిత్తూరుకు తీసుకువెల్లేందుకు మదనపల్లి పోలీసులు విశాఖ చేరుకున్నారు. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లి జంట హత్యల కేసులో నిందితులు సోమవారం విశాఖ మెంటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నారు. వారిని చిత్తూరుకు తీసుకువెల్లేందుకు మదనపల్లి పోలీసులు విశాఖ చేరుకున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఒక ఎస్.ఐ. ఐదుగురు పోలీసులు ఎస్కార్ట్ వెహికిల్ లో అక్కడికి చేరుకున్నారు. ఈ ఏడాది జనవరి 24న మదనపల్లికి చెందిన పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు ఇద్దరు కూతుళ్లు ఆలేఖ్య, సాయి దివ్య లను అతి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. 

ఫిబ్రవరి 4న వీరి మానసిక ప్రవర్తనమీద చికిత్స కోసం వారిద్దరినీ విశాఖ మానసిక హాస్పిటల్‌కు తరలించారు. విశాఖ మానసిక హాస్పిటల్ వైద్యులు, ఇరువురికీ మెరుగైన వైద్యం అందించారు. 

మానసిక పరిస్థితి మెరుగుపడడంతో పురుషోత్తం నాయుడు, పద్మజ పశ్చాత్తాపానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ పోలీసులు రోడ్డు మార్గంలో మదనపల్లె సబ్ జైలుకు తరలించనున్నారు.