Asianet News TeluguAsianet News Telugu

ఏకతాటిపైకి రావాలి.. చంద్రబాబుతో కుమారస్వామి భేటీ

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. విజయవాడలోని గేట్ వే హోటల్‌లో వీరిద్దరూ సమావేశమయ్యారు

kumaraswamy meets chandrababu naidu
Author
Vijayawada, First Published Aug 31, 2018, 10:52 AM IST

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. విజయవాడలోని గేట్ వే హోటల్‌లో వీరిద్దరూ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. మర్యాదపూర్వకంగానే తాను కుమారస్వామితో భేటీ అయ్యానని తెలిపారు.

kumaraswamy meets chandrababu naidu

ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని.. దక్షిణాదిలోని అన్ని పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మరోసారి తామిద్దరం భేటీ కావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

kumaraswamy meets chandrababu naidu

ఇంద్రకీలాద్రిపై వెంచేసియున్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు కుమారస్వామి విజయవాడ చేరుకున్నారు. అంతకు ముందు గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న కర్ణాటక ముఖ్యమంత్రికి ఏపీ అధికారులు ఘనస్వాగతం పలికారు.

kumaraswamy meets chandrababu naidu

Follow Us:
Download App:
  • android
  • ios