తెప్పలపై శ్రీ కామాక్షి అమ్మవారి కటాక్షం (ఫోటోలు)
తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో మూడోరోజైన శుక్రవారం సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మవారు తెప్పలపై భక్తులను కటాక్షించారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు అమ్మవారు ఏడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు.
తెప్పోత్సవాల్లో చివరిరోజైన శనివారం శ్రీ చండికేశ్వరస్వామివారు, శ్రీ చంద్రశేఖరస్వామివారు తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ రాజ్కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ మురళీకృష్ణ, శ్రీ రెడ్డిశేఖర్ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తెప్పలపై శ్రీ కామాక్షి అమ్మవారి కటాక్షం
తెప్పలపై శ్రీ కామాక్షి అమ్మవారి కటాక్షం
తెప్పలపై శ్రీ కామాక్షి అమ్మవారి కటాక్షం
తెప్పలపై శ్రీ కామాక్షి అమ్మవారి కటాక్షం
తెప్పలపై శ్రీ కామాక్షి అమ్మవారి కటాక్షం
తెప్పలపై శ్రీ కామాక్షి అమ్మవారి కటాక్షం