తెలుగు రాష్ట్రాల ప్రజలకు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జనసేన తరపు నుంచి ఓ పత్రికా ప్రకటనను కూడా పవన్ విడుదల చేశారు.
Add Asianetnews Telugu as a Preferred Source

‘‘ కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ 2019లోకి అడుగుపెడుతున్న తరుణంలో తెలుగు ప్రజలందరికీ నా తరపున, జనసేన సైనికుల తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన ఏడాది అనుభవాలను ప్రేరణగా తీసుకొని.. నూతన నిర్ణయాలతో ముందడుగు వేద్దాం. ఈ కొత్త సంవత్సరంలో సామాన్యుడు రాజై వెలగాలని.. మానవీయ పాలనకు, నవ చరితకు ఇది శ్రీకారం కావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ పవన్ పేర్కొన్నారు.
