Asianet News TeluguAsianet News Telugu

అన్నీ సజ్జల చూసుకుంటుంటే.. పవన్‌ని తిట్టడమే మంత్రుల పని: జనసేన నేత పోతిన మహేశ్

వైసీపీ నేతలు, మంత్రులపై జనసేన నేత పోతిన మహేశ్ మండిపడ్డారు. పవన్‌ కళ్యాణ్‌ని తిట్టడం తప్పించి మంత్రులకు వేరే పనిలేదా అని ఆయన ప్రశ్నించారు. కూల్చడంలో జగన్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ మహేశ్ దుయ్యబట్టారు. 
 

janasena leader pothina mahesh slams ysrcp leaders
Author
First Published Oct 11, 2022, 2:41 PM IST | Last Updated Oct 11, 2022, 2:41 PM IST

పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తేనే మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూల్చడంలో బ్రాండ్ అంబాసిడర్ సీఎం జగన్ అంటూ సెటైర్లు వేశారు. మూడు రాజధానుల ముసుగులో మూడు రాజ ప్యాలెస్ కోసం ఈ నాటకం ఆడుతున్నారని మహేశ్ ఆరోపించారు. విభజన హామీల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. వైసీపీ వాళ్ళకి మాత్రమే ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం పెడుతున్నారని పోతిన మహేశ్ ఆరోపించారు. ఋషికొండలో ఎన్నో భూములు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. 

దమ్ముంటే బీజేపీ ముందు ప్రత్యేక హోదా ,స్టిల్ ప్లాంట్ గురించి మాట్లాడాలని మహేశ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం లేదు.. మద్యం ఏరులే పారుతోందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలకి సేవ చేయకుండా కేవలం పవన్ కళ్యాణ్‌ని తిట్టడం కోసమే మంత్రులు ఉన్నారని మహేశ్ ధ్వజమెత్తారు. ఏం చేసారని మీరు ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మంత్రి కూడా రాష్టంలో లేకుండా తిరుగుతున్నారని.. అన్ని పనులు సజ్జల చూసుకుంటారు కాబట్టి మంత్రులకి పవన్ కళ్యాణ్ తిట్టడం పనిగా మారిందని మహేశ్ సెటైర్లు వేశారు. 

ALso Read:చంద్రబాబు పేకలో పవన్ కల్యాణ్ జోకర్.. ఉత్తరాంధ్రపై మీ వైఖరేమిటి..?: మంత్రి అమర్‌నాథ్

గుడివాడ అమర్‌నాథ్ రికార్డింగ్ డ్యాన్స్‌లు తప్పించి ఏం చేశాడని ఆయన ప్రశ్నించారు. తిరుమల మీద రోజా రాజకీయ విమర్శలు చేయడం మంచి పద్దతి కాదని పోతిన మహేశ్ హితవు పలికారు. ప్రతి పదిహేను రోజులకి ప్రోటో కాల్ అని చెప్పి అందరిని దర్శనం చేపించి చిల్లర వసూల్ చేస్తుందని ఆయన ఆరోపించారు. ఋషి‌కొండకి అనుమతులు ఇచ్చిన వెంటనే బెంజ్ కార్ వచ్చిందని... నీ బయోపిక్ కూడా సినిమా తీస్తే సెన్సార్ కూడా అవ్వదంటూ మహేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి ఉద్యమం మరొక స్వాతంత్ర ఉద్యమం లాంటిదని ఆయన అభివర్ణించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా రైతులు ముందుకు పోతున్నారని మహేశ్ ప్రశ్నించారు. 

ఒక్క రాజధాని కట్టలేని వాడు మూడు రాజధానులు అంటున్నారంటూ జగన్‌పై సెటైర్లు వేశారు. అమరావతి ఉద్యమం ఐదు కోట్ల మంది చేస్తున్నారని.. కావాలని మూడు రాజధానుల బ్యానర్స్ కట్టి రెచ్చకొడుతున్నారని మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దారి పొడవునా జనసేన నాయకులు మద్దతుగా ఇస్తుంటే వైసీపీ భయపడిపోతుందని.. అమరావతి ఉద్యమానికి జనసేన అండగా ఉంటుందన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios