Asianet News TeluguAsianet News Telugu

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకొనేందుకు మోడీని కలుస్తా: పవన్ కళ్యాణ్

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ప్రధాని మోడీని కలుస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

janasena chief pawan kalyan reacts on visakha steel factory privatisation lns
Author
Visakhapatnam, First Published Feb 5, 2021, 5:47 PM IST


అమరావతి: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ప్రధాని మోడీని కలుస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు.శుక్రవారం నాడు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి.

also read:ఆందోళనలు చేస్తే ప్రైవేటీకరణ ఆగదు: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సుజనా చౌదరి

ఈ ఆందోళనల నేపథ్యంలో జనసేన స్పందించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించింది మన్మోహన్ సింగేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు,.విశాఖ ఉక్కును కాపాడుకొంటామని ఆయన తేల్చి చెప్పారు. విశాఖ ఉక్కు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆయన పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం 32 మంది ప్రాణాలు పోగొట్టుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ఇందరి త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన ఈ కర్మాగారం చేతులు మారుతుందంటే తెలుగువారికి ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ ఫ్యాక్టరీని కాపాడుకోవడం కోసం జనసేన తన వంతు ప్రయత్నం  చేస్తోందన్నారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వివరిస్తామన్నారు. ఈ మేరకు జనసేన తరపున  ఆ పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహార్ ఈ విషయాన్ని ప్రకటించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios