'శతఘ్ని'ని ఆవిష్కరించిన పవన్, జనసేనాని ప్లాన్ ఇదే
జనసేన పార్టీ పత్రిక 'శతఘ్ని'ని ఆ పార్టీ చీప్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు హైద్రాబాద్లో విడుదల చేశారు. పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పత్రిక ఉపయోగించుకొంటామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్: జనసేన పార్టీ పత్రిక 'శతఘ్ని'ని ఆ పార్టీ చీప్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు హైద్రాబాద్లో విడుదల చేశారు. పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పత్రిక ఉపయోగించుకొంటామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
గురువారం నాడు పార్టీ కార్యాలయంలో జనసేన చీఫ్ పార్టీ పక్షపత్రిక శతఘ్నిని ఆవిష్కరించారు. జనసేన సిద్దాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వీలుగా ఈ పత్రికను వెలువరించనున్నట్టు జనసేన ప్రకటించింది.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి జనసేన పార్టీ సభ్యత్వాన్ని 50 లక్షలకు చేరువయ్యేలా చేయాలని పార్టీ చీఫ్ వపన్ కళ్యాణ్ ఆదేశించారు. అంతేకాకుండా ఈ నెలలో వాడవాడలా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు.
జనసేన ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో చేయనున్న కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను ఈ పత్రికలో పొందుపర్చనున్నారు.పార్టీ క్యాడర్కు ఈ పక్షపత్రిక ఓ ఆయుధంగా ఉపయోగపడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ వార్తను చదవండి:పవన్తో మధ్యాహ్నం భేటీ: జనసేనలోకి మోత్కుపల్లి