Asianet News TeluguAsianet News Telugu

'శతఘ్ని'ని ఆవిష్కరించిన పవన్, జనసేనాని ప్లాన్ ఇదే

జనసేన పార్టీ పత్రిక 'శతఘ్ని'ని ఆ పార్టీ చీప్  పవన్ కళ్యాణ్ గురువారం నాడు హైద్రాబాద్‌లో విడుదల చేశారు. పార్టీ సిద్దాంతాలను  ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పత్రిక ఉపయోగించుకొంటామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
 

Janasena chief Pawan Kalyan launches Shatagni paper

హైదరాబాద్: జనసేన పార్టీ పత్రిక 'శతఘ్ని'ని ఆ పార్టీ చీప్  పవన్ కళ్యాణ్ గురువారం నాడు హైద్రాబాద్‌లో విడుదల చేశారు. పార్టీ సిద్దాంతాలను  ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పత్రిక ఉపయోగించుకొంటామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

గురువారం నాడు పార్టీ  కార్యాలయంలో  జనసేన చీఫ్ పార్టీ పక్షపత్రిక శతఘ్నిని ఆవిష్కరించారు.  జనసేన  సిద్దాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వీలుగా  ఈ పత్రికను  వెలువరించనున్నట్టు  జనసేన ప్రకటించింది.

ఈ ఏడాది డిసెంబర్ నాటికి  జనసేన పార్టీ సభ్యత్వాన్ని 50 లక్షలకు  చేరువయ్యేలా  చేయాలని పార్టీ చీఫ్ వపన్ కళ్యాణ్ ఆదేశించారు.  అంతేకాకుండా ఈ నెలలో వాడవాడలా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు.

జనసేన ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో చేయనున్న కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను ఈ పత్రికలో  పొందుపర్చనున్నారు.పార్టీ క్యాడర్‌కు ఈ పక్షపత్రిక  ఓ ఆయుధంగా ఉపయోగపడే అవకాశం ఉందని  పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ వార్తను చదవండి:పవన్‌తో మధ్యాహ్నం భేటీ: జనసేనలోకి మోత్కుపల్లి

 

Follow Us:
Download App:
  • android
  • ios