సామాన్య భక్తులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకొన్న జగన్
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సామాన్య భక్తులతో కలిసి గురువారం సాయంత్రం శ్రీవారిని దర్శించుకొన్నారు.
తిరుమల: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సామాన్య భక్తులతో కలిసి గురువారం సాయంత్రం శ్రీవారిని దర్శించుకొన్నారు.పాదయాత్రను ముగించుకొని గురువారం నాడు జగన్ తిరుపతికి చేరుకొన్నారు. మధ్యాహ్నం 1:40 నిమిషాలకు అలిపిరి నుండి తిరుమలకు బయలుదేరారు.
సాయంత్రం 4:40 గంటలకు జగన్ తిరుమల కొండపైకి చేరుకొన్నారు. తిరుమల కొండపై ఉన్న ఓ గెస్ట్హౌజ్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొన్న తర్వాత సామాన్య భక్తుడి మాధిరిగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకొన్నారు. జగన్కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.
సంబంధిత వార్తలు
తండ్రి బాటలోనే తిరుమల కొండపైకి వైఎస్ జగన్