చంద్రబాబు మీద ఎన్టీయార్ బాంబ్ వేసిన జగన్ (వీడియో)
చంద్రబాబు మీద ఎన్టీయార్ బాంబ్ వేసిన జగన్ (వీడియో)
కృష్ణా జిల్లాకు నందమూరి తారక రామారావు పేరు పెడతానని ప్రతిపక్ష నేత , వైసిపిఅధ్యక్షుడు వైఎస్ జగన్మోన్ రెడ్డి ప్రకటించారు. ఈ రోజు ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరును జగన్ సందర్శించారు. నిమ్మకూరులో నీరు-చెట్టు కార్యక్రమంలో జరుగుతున్న దోపిడీని, అవినీతిని గ్రామస్థులు జగన్ దృష్టికి తెచ్చారు. స్వయానా నందమూరి కుటుంబ సభ్యులే ఆయనను కలుసుకుని ఈ వివరాలందించారు. తన దోపిడీకి ఆఖరికి స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామాన్నికూడా చంద్రబాబు ప్రభుత్వం వదలలేదని వారు ఆరోపించారు.