వివేకా హత్య కేసులో ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. అందులో.. కుటుంబ సభ్యులప్రమేయం ఉందని మొదట్లో తాము అనుమానించే లేదని అప్పట్లోనే సందేహించి ఉంటే 2019 ఎన్నికల్లో జగన్, అవినాష్ రెడ్డి ఓడిపోయే వారిని రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
ఎన్నికల్లో గెలిచేందుకు YS Jagan, వైయస్ వివేకానంద రెడ్డి murderకు పథకం రచన చేసి ఉంటారన్నది తన అభిప్రాయమని సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేక అల్లుడు Rajasekhar Reddyపేర్కొన్నాడు. 2018లో జగన్పై విశాఖ విమానాశ్రయంలో Chicken knifeతో దాడి జరిగింది. జగన్ భుజానికి గాయం అయింది. అది తన మెడపై తగలాలని ఉందని తాను వేగంగా స్పందించి చేయి అడ్డు పెట్టడం వల్ల చేతికి గాయం అయిందని జగన్ అప్పట్లో చెప్పారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించుకుని హైదరాబాద్ వెళ్లి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. తనకు చికిత్స చేసిన ఇద్దరు ప్రైవేటు వైద్యులకు అధికారంలోకి వచ్చాక కీలక పదవులు ( డాక్టర్ సాంబశివ రెడ్డి ని మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా, డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఏపీ వైద్య సేవ, వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించారు) కట్టబెట్టారు. ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యత వారికి అప్పగించారు. ఆ దాడి లాగే ఎన్నికల్లో గెలవడం కోసం మామ హత్యకు జగన్ ఏ పథక రచన చేసి ఉంటారు’ అని రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నాడు.
అప్పట్లోనే అనుమానించి ఉంటే… జగన్, అవినాష్ రెడ్డి ఓడిపోయే వారు…
వివేకా హత్య కుటుంబ సభ్యులప్రమేయం ఉందని మొదట్లో తాము అనుమానించే లేదని అప్పట్లోనే సందేహించి ఉంటే 2019 ఎన్నికల్లో జగన్, అవినాష్ రెడ్డి ఓడిపోయే వారిని రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
‘వివేక చనిపోయాక ఆయన వ్యక్తిగత జీవితం గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఫిర్యాదు చేయడానికి 2019 మార్చి 23న నేను, సునీత సైబరాబాద్ పోలీస్ స్టేషన్కు బయల్దేరాం. వైఎస్ భారతి, విజయమ్మ సజ్జల రామకృష్ణారెడ్డి మా ఇంటికి వచ్చారు.
వివేకా హత్యకు సంబంధించి మేం ఏం చేసినా సజ్జ లకు చెప్పాలని భారతి భారతి సూచించారు. అప్పటికి మా కుటుంబ సభ్యులు ఎవరికైనా సందేహాలు లేవు. అప్పట్లోనే సందేహం వ్యక్తం చేస్తే జగన్, అవినాష్ రెడ్డి రాజకీయంగా చాలా ఇబ్బందులు పడేవారు’ అని పేర్కొన్నారు ‘హత్య జరిగిన రోజు జగన్ హైదరాబాద్ నుంచి సాయంత్రానికి పులివెందుల చేరుకున్నారు. విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడాలో సజ్జలతో చర్చించారు. అప్పటికి ఆ ఇంట్లో దొరికిన విషయం గానీ, అందులో డ్రైవర్ ప్రసాద్ పేరు ఉన్నట్లుగానీ నాకు, పోలీసులకు తప్ప ఎవరికీ తెలియదు. అయితే జగన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆ లేఖ గురించి ప్రస్తావించారు. వివేకా హత్య రాజకీయాలతో ముడిపెట్టడం జగన్ మాట్లాడడం మాకు నచ్చలేదు. అదే విషయాన్ని ఆ తర్వాత ఆయనకు చెప్పాను’ అని రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నుపోటు…
‘ 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం వివేకాకు అసలు ఇష్టం లేదు. ఆయన రాజకీయాలనుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. కానీ జగన్ ఒత్తిడి మేరకే పోటీ చేశారు. అప్పట్లో అమెరికాలో ఉన్న నాకు ఎర్ర గంగిరెడ్డి ఫోన్ చేసి వివేకాను పోటీకి పంపించాలని కోరారు. టిడిపి నాయకులు రామ సుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి చేతులు కలిపారని, వివేక అయితేనే గెలవగలరు అని చెప్పారు. ఆ ఎన్నికల్లో తనకంటే బలహీన అభ్యర్థి అయిన బీటెక్ రవి పై కేవలం 30 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కారణమేమిటని ఎర్ర గంగిరెడ్డికి ఫోన్ చేసి అడిగాను.
అంతర్గత వెన్నుపోటు కారణం అని చెప్పాడు. అప్పటికి అవినాష్ రెడ్డి కుటుంబానికి ఎర్ర గంగిరెడ్డి దగ్గర అయ్యాడని తెలిసింది. ఎన్నికల తర్వాత పొద్దుటూరులో తన సోదరుడి పేరు మీద ఎర్ర గంగిరెడ్డి రూ.విలువైన వ్యవసాయ భూములు కొన్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా పై గెలిచిన బీటెక్ రవి కాలేజీలో నాకు జూనియర్. ఆ ఎన్నికల్లో వివేకా కోసం కాకుండా, తన కోసం పని చేసేందుకు శివశంకర్ రెడ్డికి రూ. 70 లక్షలు ఇచ్చారని బీటెక్ రవి నాకు చెప్పారు.మ మా బంధువులైన భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి లతో పాటు శివశంకర్ రెడ్డి ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం లోని ఓట్లు వివేకాకు పడకుండా చేయడం వల్లే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
వివేకాకు మొదటినుంచి ఖర్చు ఎక్కువ. దానధర్మాలు విరివిగా చేసేవాడు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చేసిన అప్పులు తీర్చడానికి మేము హైదరాబాదు లోని రెండు ఇల్లు, ఒక ప్లాటు, హిమాచల్ ప్రదేశ్ లోని జల విద్యుత్ కేంద్రం లో 10 శాతం వాటా అమ్ముకోవాల్సి వచ్చింది’ అని వాంగ్మూలంలో రాజశేఖర్ రెడ్డి వివరించారు.
గుండెపోటు అని నేను ఎప్పుడూ చెప్పలేదు…
‘2019 మార్చి 15 న నేను నేను ఈ శంకరయ్య కు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుగులో రాసి ఉన్న ఒక కాగితాన్ని నాకు సిబిఐ అధికారులు చూపించారు. ఆరోజు నేను ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆరోజు హైదరాబాదు నుంచి వేకువజామునే బయలుదేరామని, వివేకా హత్య గురించి కృష్ణారెడ్డి ఫోన్ చేసే సమయానికి మేము కర్నూలుకు చేరుకున్నాము అని రాసి ఉంది. ఆ రోజు ఉదయం 6.15కి కృష్ణారెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. అప్పటికి హైదరాబాదు లోనే ఉన్నాం. 7:30 కి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. వివేకా గుండెపోటుతో చనిపోయి ఉంటారని, మంచం మీది నుంచి కింద పడడం వల్లే దెబ్బలు తగిలి ఉంటాయని నేను అన్నట్లుగా రాశారు. అదీ నిజం కాదు. నేను ఎప్పుడూ అలా చెప్పలేదు. 2019 మార్చి 29న పులివెందుల ఎస్ డి పి ఓ డి నాగరాజు కి నేను మరో స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. అదీ నిజం కాదు. దాన్ని సృష్టించారు. 2019 మార్చి 15న సిఐ శంకరయ్య నాకు నోటీసు ఇచ్చినట్లుగా అందులో పేర్కొన్నారు. నాకు పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. కేసును తప్పుదారి పట్టించేందుకు పోలీసులే ఆ తప్పుడు స్టేట్మెంట్లన్నీ సృష్టించారు’ అని పేర్కొన్నారు.
వివేకానందరెడ్డికి, భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. 2017 లో ప్రభుత్వ భూమిని స్థానిక శ్రీకృష్ణ ఆలయ కమిటీ కేటాయించేలా వివేక ప్రయత్నించారు. అది అవినాష్ రెడ్డి కి ఇష్టం లేదు. సర్వే జరగకుండా అడ్డుకున్నారు. వివేకా రాజకీయ భాస్కర్ రెడ్డి పరపతి ముందు భాస్కర్ రెడ్డి, ఇ అవినాష్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి మరుగుజ్జులు. వివేక అంటే వారు భయపడేవారు. ఆయన ముందు నిలబడాలంటే నే అసౌకర్యంగా భావించేవారు తన కుటుంబ సభ్యుల కోసం ఎన్ని త్యాగాలు చేసిన వారు తనంటే అసూయ తోనే ఉంటున్నారని చనిపోవడానికి రెండు మూడు నెలల ముందు వివేకా నాతో చెప్పి బాధపడ్డారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు… ఆయన, వివేకా ఒకరికి ఒకరు బాసటగా నిలిచే వారు. ఒకరు ఎంపీగా పోటీ చేస్తే , ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు. అవసరాన్ని బట్టి అటూ, ఇటుగా మారేవారు. రాజశేఖరరెడ్డి మరణించాక… ఆ స్థానం నుంచి పోటీకి భాస్కర్ రెడ్డి పేరును జగన్ ప్రతిపాదించారు. కానీ వివేకాకు అదృష్టం లేదు. విజయమ్మ గాని, జగన్ గానీ పోటీ చేయాలని సూచించారు. దాంతో వారి మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. అలాగే భాస్కర్ రెడ్డి, ఇ మనోహర్ రెడ్డి ల అభిమతానికి విరుద్ధంగా వివేక ఒక భూవివాదం సెటిల్మెంట్ లో పాల్గొన్నారు. అప్పటినుంచి వారు మరింత కక్ష పెంచుకున్నారు’ అని తెలిపారు.
రాజకీయంగా వాడుకోవాలి అనుకున్నారు..
‘ వివేకా హత్య జరిగిన రోజు కడప మాజీ మేయర్ సురేష్, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఒక కంప్లైంట్ రాసుకొని వచ్చి నా భార్య సునీతను సంతకం పెట్టాలన్నారు. దానిలో టిడిపి నాయకులు సతీష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి పేర్లను అనుమానితులుగా పేర్కొన్నారు. ఆ కంప్లైంట్ సరైన పద్ధతిలో లేదని చెప్పి దానిపై సంతకం చేయడానికి సునీత నిరాకరించింది. ఆ ముగ్గురు టీడీపీ నాయకులు కావడంతో ఈ నేరం చేశారని దానికి నిర్దిష్టమైన ఆధారం ఏది లేకపోయినా, కేసును రాజకీయ కోణంలో మలుపు తిప్పుతున్నారు అని గుర్తించడం ఆమె సంతకం చేయక పోవడానికి ప్రధాన కారణం. ఆమెకు ఆ సమయంలో రాజకీయాలు ముఖ్యం కాదు. ఆ తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆ ముగ్గురిపై అనుమానం ఉందని చెప్పారు 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే సిట్ ను వైసిపి నీరుగార్చింది’ అని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం లో రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
