Asianet News TeluguAsianet News Telugu

ఐఎన్ఎన్ఎస్ మీడియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు: టీడీపీకే పట్టం,బోణి కొట్టిన జనసేన

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధిస్తుందని న్యూఢిల్లీకి చెందిన నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో స్పష్టం చేసింది. ఏపీలో ప్రజలు తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టారని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడించింది. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రతిపక్షానికే పరిమితం కానున్నట్లు తెలిపింది. ఇకపోతే జనసేన పార్టీకి మాత్రం మంచి కబురుచెప్పింది. 

inss media exit poll results: tdp seems to be head 118 seats
Author
Hyderabad, First Published May 19, 2019, 6:36 PM IST

న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధిస్తుందని న్యూఢిల్లీకి చెందిన నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో స్పష్టం చేసింది. 
 ఏపీలో ప్రజలు తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టారని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడించింది. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రతిపక్షానికే పరిమితం కానున్నట్లు తెలిపింది. ఇకపోతే జనసేన పార్టీకి మాత్రం మంచి కబురుచెప్పింది. జనసేన పార్టీ 5 స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. 

ఇకపోతే లోక్ సభ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. 2014లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న స్థానాలను కూడా కోల్పోతుందని తెలిపింది. కేవలం 7 స్థానాలకే పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల్లో స్పష్టం చేసింది. ఇకపోతే జనసేన పార్టీ ఒక లోక్ సభ స్థానంలో విజయం సాధిస్తోందని తెలిపింది.

ఎలైట్ ఎలక్ట్రోరల్ కాలుక్యులేషన్ లిమిటెడ్ సంస్థ సర్వే వివరాలు

1. 2019 శాసన సభ ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు:

వ.నం     పార్టీ పేరు                                 గెలిచేస్థానాల సంఖ్య   పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం

1.          తెలుగుదేశం                                       118                             0

2.        వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ                      52                              0

3.       జనసేన పార్టీ                                         5                                 0

ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి.

2. 2019 ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు:

వ.నం           పార్టీ పేరు                              గెలిచే స్థానాల సంఖ్య                పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం

1.               తెలుగుదేశం                                   17                                               0

2.               వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ                  7                                                0

3.              జనసేన పార్టీ                                     1                                               0
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన పార్టీలు ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటి పడ్డాయి.

ఈ వార్తలు కూడా చదవండి

ఎలైట్ ఎగ్జిట్ పోల్ సర్వే: టీడీపీదే విజయం

టీడీపీకి 100 దాటనున్న అసెంబ్లీ స్థానాలు: లగడపాటి ఎగ్జిట్ పోల్‌

ఆరా ఎగ్జిట్ పోల్స్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం

Follow Us:
Download App:
  • android
  • ios