India Justice Report 2025: ఇండియా జస్టిస్ ర్యాంకింగ్స్‌ 2025 లో శాంతిభద్రత, పోలీసింగ్, న్యాయ సహాయ విభాగంలో తెలుగు రాష్టాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అద్వితీయ స్థానంలో నిలిచాయి. ఈ ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్ 2వ, తెలంగాణ 3వ స్థానాల్లో నిలిచింది.

India Justice Report 2025: తెలుగు రాష్ట్రాలు అద్భుతమైన ప్రదర్శనతో సత్తా చాటుతున్నాయి. ఇండియా జస్టిస్ ర్యాంకింగ్స్ 2025లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లు టాప్ ఫ్లేస్ లో నిలిచాయి. ఈ రాష్ట్రాలు ప్రజల కోసం న్యాయసహాయం, శాంతిభద్రతల నిర్వహణ, పోలీసింగ్ పనితీరు వంటి కీలక అంశాల్లో ముందంజలో ఉన్నాయి. భారత న్యాయ వ్యవస్థలో తమ ప్రభావాన్ని మరింత బలపరిచాయి. అయితే, ఈ ర్యాంకింగ్స్‌లో ఈ రెండు రాష్ట్రాలు ఎన్నో స్థానంలో నిలిచాయంటే?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాజా ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 (India Justice Report 2025) ప్రకారం.. దేశంలోని న్యాయవ్యవస్థ పనితీరు, పోలీసింగ్ సామర్థ్యం, శాంతిభద్రతల నిర్వహణలో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. 10లో 6.78 స్కోరుతో కర్ణాటక ఫస్ట్ ఫ్లేస్ సంపాదించుకుంది. ఆ తరువాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ 6.32 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. తరువాత స్థానాల్లో తెలంగాణ 6.15 స్కోర్ లో మూడో స్థానంలో నిలిచారు. ఆ తరువాత కేరళ 6.09 స్కోర్ తో 4 స్థానంలో, తమిళనాడు 5.92 స్కోర్లతో 5 వ స్థానంలో నిలిచాయి.

ఈ ర్యాంకింగ్ రాష్ట్రాల పోలీసింగ్ విధానాలు, న్యాయ సహకారం, సామాజిక, చట్టపరమైన పాలన అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించబడింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల నిర్వహణలో గణనీయమైన పురోగతులు సాధించాయని ఈ నివేదిక పేర్కొంది.

ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ తాజా కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రంలో చట్టబద్ధత, ప్రజా భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి మంచి పనితీరు కనబరిచినట్లు పేర్కొంది. తెలంగాణ, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలూ న్యాయ వ్యవస్థను మెరుగుపరచడంలో అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఈ రిపోర్ట్ ఆధారంగా వచ్చే రోజుల్లో ఇతర రాష్ట్రాలు కూడా ఈ రాష్ట్రాల విజయాలను కోల్పోకుండా బలోపేతం చేసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.