జనసేనలోకి ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే ?
వచ్చే నెలలో లల్లూ జనసేనలో చేరే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్(లల్లూ) జనసేన పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. ప్రజాపోరాట యాత్రను భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత మూడు రోజులుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు పార్టీ నేతలు లల్లూ విషయాన్ని పవన్ కళ్యాణ్ తో ప్రస్తావించినట్టు సమాచారం పవన్ నుంచి సానుకూల స్పందన రావడంతో.. వచ్చే నెలలో లల్లూ జనసేనలో చేరే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. అయితే ఈ విషయంపై పవన్, లల్లూల నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.