ఐపీఎస్ బాలసుబ్రమణ్యంపై దౌర్జన్యం: టీడీపీ నేతలకు హైకోర్టు నోటీసులు
2017 మార్చిలో రవాణ శాఖ కమిషనర్గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి బాల సుబ్రమణ్యంతో పాటు, కొందరు అధికారులపై దౌర్జన్యానికి పాల్పడినట్టుగా విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలపై హైకోర్టు నోటీసులు పంపింది.
విజయవాడ: 2017 మార్చిలో రవాణ శాఖ కమిషనర్గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి బాల సుబ్రమణ్యంతో పాటు, కొందరు అధికారులపై దౌర్జన్యానికి పాల్పడినట్టుగా విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలపై హైకోర్టు నోటీసులు పంపింది.
ఓ ట్రావెల్స్ విషయంలో రవాణా శాఖ అధికారులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, నాగుల్మీరాలు దౌర్జన్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ విషయమై ఆ తర్వాత చంద్రబాబునాయుడు పార్టీ నేతలపై సీరియస్ అయ్యారు. బాబు ఆదేశాల మేరకు వారంతా సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యానికి క్షమాపణ చెప్పారు.
ఇదిలా ఉంటే ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకొంది. ఈ నలుగురికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ కమిషనర్ ద్వారా నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణను ఈ ఏడాది జూన్ మాసానికి వాయిదా వేసింది హైకోర్టు.