2017 మార్చిలో రవాణ శాఖ కమిషనర్గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి బాల సుబ్రమణ్యంతో పాటు, కొందరు అధికారులపై దౌర్జన్యానికి పాల్పడినట్టుగా విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలపై హైకోర్టు నోటీసులు పంపింది.
విజయవాడ: 2017 మార్చిలో రవాణ శాఖ కమిషనర్గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి బాల సుబ్రమణ్యంతో పాటు, కొందరు అధికారులపై దౌర్జన్యానికి పాల్పడినట్టుగా విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలపై హైకోర్టు నోటీసులు పంపింది.
ఓ ట్రావెల్స్ విషయంలో రవాణా శాఖ అధికారులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, నాగుల్మీరాలు దౌర్జన్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ విషయమై ఆ తర్వాత చంద్రబాబునాయుడు పార్టీ నేతలపై సీరియస్ అయ్యారు. బాబు ఆదేశాల మేరకు వారంతా సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యానికి క్షమాపణ చెప్పారు.
ఇదిలా ఉంటే ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకొంది. ఈ నలుగురికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ కమిషనర్ ద్వారా నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణను ఈ ఏడాది జూన్ మాసానికి వాయిదా వేసింది హైకోర్టు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 19, 2019, 12:36 PM IST