వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వినిపిస్తున్న పేరు గ్రామ వాలంటీర్లు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ అందించడం, సమస్యల గుర్తింపు, సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఈ వ్యవస్థకు జగన్మోహన్ రెడ్డి రూపకల్పన చేశారు. 

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వినిపిస్తున్న పేరు గ్రామ వాలంటీర్లు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ అందించడం, సమస్యల గుర్తింపు, సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఈ వ్యవస్థకు జగన్మోహన్ రెడ్డి రూపకల్పన చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అటువంటి వాలంటీర్ల నియామక ప్రక్రియను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే వాలంటీర్ల నియామకం జిల్లాల వారీగా కలెక్టర్లు నోటీఫికేషన్లు జారీ చేస్తున్నారు.

ఇప్పటి వరకు 11 జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదలవగా.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇంకా జారీ చేయలేదు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 21,600 పోస్టులు ఉండగా.. అత్యల్పంగా కడప జిల్లాలో 9,322 పోస్టులు ఉన్నాయి.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:

శ్రీకాకుళం- 11,924
విజయనగరం- 10,012
విశాఖపట్నం- 12,272
తూర్పుగోదావరి- 21,600
పశ్చిమ గోదావరి- 17,881
కృష్ణా- 14,000
గుంటూరు- 17,550
అనంతపురం- 14,007
చిత్తూరు- 15,824
కర్నూలు- 12,045
కడప- 9,322