ప్రకాశం జిల్లాలో గురువారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 

ఒంగోలు: ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం కొత్తపల్లిలో గురువారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులంతా కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

కర్ణాటకకు చెందిన వారు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.