కడప జిల్లాలోని రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఎం. నారాయణరెడ్డి గురువారం నాడు మృతి చెందారు. కొంత కాలంగా ఆయన  అనారోగ్యంతో బాధపడుతున్నారు. 


రాయచోటి: కడప జిల్లాలోని రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఎం. నారాయణరెడ్డి గురువారం నాడు మృతి చెందారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

1994లో జరిగిన ఉప ఎన్నికలు ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆయన రెండు పర్యాయాలు శాసనసభకు ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా నారాయణరెడ్డికి పేరుంది. నారాయణరెడ్డికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు.

రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నారాయణరెడ్డి కీలకంగా వ్యవహరించారు. నారాయణరెడ్డి మృతితో పలు పార్టీల నేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.