మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి కన్నుమూత
కడప జిల్లాలోని రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఎం. నారాయణరెడ్డి గురువారం నాడు మృతి చెందారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
రాయచోటి: కడప జిల్లాలోని రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఎం. నారాయణరెడ్డి గురువారం నాడు మృతి చెందారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
1994లో జరిగిన ఉప ఎన్నికలు ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆయన రెండు పర్యాయాలు శాసనసభకు ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా నారాయణరెడ్డికి పేరుంది. నారాయణరెడ్డికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు.
రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నారాయణరెడ్డి కీలకంగా వ్యవహరించారు. నారాయణరెడ్డి మృతితో పలు పార్టీల నేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.