కులపిచ్చికి జగన్ బ్రాండ్ అంబాసిడర్: మాజీ మంత్రి జవవహర్
కులపిచ్చికి బ్రాండ్ అంబాసిడర్ జగన్రెడ్డి అని మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ని రెడ్ల రాజ్యంగా మార్చింది జగన్రెడ్డేనన్నారు. ఇదంతా కులపిచ్చి బాగా ఎక్కువైపోయిన సాయిరెడ్డికి కనిపించడంలేదన్నారు
అమరావతి: కులపిచ్చికి బ్రాండ్ అంబాసిడర్ జగన్రెడ్డి అని మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ని రెడ్ల రాజ్యంగా మార్చింది జగన్రెడ్డేనన్నారు. ఇదంతా కులపిచ్చి బాగా ఎక్కువైపోయిన సాయిరెడ్డికి కనిపించడంలేదన్నారు
సీఎం నుంచి వార్డు మెంబర్ వరకూ రాష్ట్రమంతా రెడ్లమయం అయిపోయిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ కార్పొరేషన్లకు రెడ్లను వేసుకోవడానికి వీలులేక వదిలేశారన్నారు. నామినేటెడ్ ఉన్నత పదవులు 800 మందికి పైగా రెడ్లకే కట్టబెట్టడం కుల దురభిమానానికి పరాకాష్టగా నిలిచిందన్నారు.
యూనివర్సిటీలు వీసీ నుంచి సెక్యూరిటీ గార్డు వరకూ రెడ్లే. జగన్రెడ్డి కులోన్మాదం పతాకస్థాయికి చేరిందని రెడ్లందరికీ అందలాలెక్కిస్తూ అణగారిన వర్గాలని తొక్కేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకూ దళితులపై 60కి పైగా దాడులు జరిగాయని కేసులు కూడ నమోదయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఇంకా నమోదు కాని రెడ్ల అరాచకాలెన్నో వున్నాయన్నారు. రాష్ట్రాన్ని ఐదు ముక్కలు చేసి ఐదుగురు రెడ్లకు రాసిచ్చేశారంటే! ఇది తనకు వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యమనుకుంటున్నట్టున్నారని జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబునాయుడికి కులపిచ్చి అని ఆరోపించిన విజయసాయిరెడ్డికి దమ్ముంటే..టిడిపి హయాంలో జరిగిన నియామకాలు, జగన్రెడ్డి హయాంలో రెడ్లకు జరిగిన పదవుల పందేరంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు