గుంటూరు జీజీహెచ్లో అగ్నిప్రమాదం: రోగుల్ని కాపాడిన సిబ్బంది
గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐసీయూ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు
గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐసీయూ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.
అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఐసీయూ వార్డులో వున్న రోగులను సిబ్బంది మరో వార్డుకు తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.