Asianet News TeluguAsianet News Telugu

ప్రకాశం జిల్లాలో విషాదం... భార్యాభర్తలు, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య

ప్రకాశం జిల్లాలో విషాదం శుక్రవారం రాత్రి విషాద సంఘటన చోటుచేసుకుంది. వ్యాపారం  నిమిత్తం తీసుకున్న అప్పుల అంతకంతకు పెరిగి అప్పులిచ్చిన వారి నుండి ఒత్తిడి పెరగడంతో ఓ కుటుంబం దారుణ నిర్ణయం తీసుకుంది. భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు సంతానం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

family suicide in prakasham district
Author
Prakasam, First Published Mar 16, 2019, 8:27 AM IST

ప్రకాశం జిల్లాలో విషాదం శుక్రవారం రాత్రి విషాద సంఘటన చోటుచేసుకుంది. వ్యాపారం  నిమిత్తం తీసుకున్న అప్పుల అంతకంతకు పెరిగి అప్పులిచ్చిన వారి నుండి ఒత్తిడి పెరగడంతో ఓ కుటుంబం దారుణ నిర్ణయం తీసుకుంది. భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు సంతానం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామానికి చెందిన నాగరాజు, ఈశ్వరి భార్యాభర్తలు. వీరికి వైష్ణవి, వరలక్ష్మి ఇద్దరు సంతానం. అయితే ఉపాధి నిమిత్తం కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లిన నాగరాజు అక్కడ ఓ హోటల్ నడిపేవాడు. ఈ క్రమంలో పెట్టుబడి నిమిత్తం తెలిసిన వారి  దగ్గర భారీగా అప్పులు చేశాడు. 

అయితే ఈ అప్పులు, వడ్డీలు అంతకంతకు పెరుగడం... వ్యాపారం సరిగ్గా జరగక పోవడంతో నాగరాజు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఈ మధ్యకాలంలో అప్పులవారి బాధ మరీ ఎక్కువవడంతో శుక్రవారం కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. కుటుంబం మొత్తం రోజంతా బంధువులతో గడిపి రాత్రి ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఓ కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగి సామూహికంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

ఇవాళ ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios