Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం.. గోదావరిలో దూకి కుటుంబం ఆత్మహత్య...!

వివాహేతర సంబంధం ఓ నిండు కుటుంబాన్ని బలి తీసుకుంది. తూర్పు గోదావరి జిల్లా మొగలి కుదురుకు చెంిన కంచి సతీష్ (32), కంచి సంధ్య(22)లు తమ పిల్లలు జశ్వన్ (4), ఇందుశ్రీదుర్గ(2)లతో కలిసి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 

extra marital affair : family committed suicide in west godavari
Author
hyderabad, First Published Aug 2, 2021, 1:28 PM IST

‘డాడీ.. నేను ఒకడి చేతిలో మోసపోయాను. నా జీవితాన్ని నాశనం చేశాడు. ఫలితంగా నేను, నా భర్త, పిల్లలు ఇద్దరితో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నాం..’ చనిపోయే ముందు.. ఆ ఇల్లాలి ఆడియో సందేశం ఇది. వాట్సాప్ గ్రూపుల్లో హల్ చల్ చేసింది. 

దీనిని బట్టి చెప్పొచ్చు.. వివాహేతర సంబంధం మూలంగా ఆమె ఎంత క్షోభ అనుభవించిందో, ఎంత మానసిక వేదనకు గురైందో.. చివరికి తను, భర్త, ఇద్దరు పిల్లల ప్రాణాలను మూల్యంగా చెల్లించుకుంది. 

వివాహేతర సంబంధం ఓ నిండు కుటుంబాన్ని బలి తీసుకుంది. తూర్పు గోదావరి జిల్లా మొగలి కుదురుకు చెంిన కంచి సతీష్ (32), కంచి సంధ్య(22)లు తమ పిల్లలు జశ్వన్ (4), ఇందుశ్రీదుర్గ(2)లతో కలిసి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో సతీష్, ఇందుశ్రీదుర్గ మృతదేహాలు ఆదివారం పోలీసులకు లభించగా తల్లి, కుమారుడి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామానికి చెందిన సంధ్యకు తూర్పు గోదావరి జిల్లా మొగలికుదురుకు చెందిన సతీష్ తో ఆరేళ్ల కిందట వివాహమయ్యింది. తాపీ పని చేసుకునే సతీష్ రెండేళ్ల కిందట గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో సంధ్యకు కేశవదాసుపాలేనికి చెందిన ఫణీంద్రతో వివాహేతర సంబంధం ఏర్పడింది. 

ఈ నేపథ్యంలో ఫణీంద్ర సంధ్య నుంచి బంగారం, నగదు కూడా తీసుకున్నాడు. విషయం బయటకు పొక్కడంతో పెద్దల సమక్షంలో రాజీ ప్రయత్నాలు జరిగాయి. కొంత బంగారం, నగదు వెనక్కి వచ్చాయి. దీంతో సంధ్య అత్తామామలు, పిల్లల్ని వారి దగ్గర ఉంచుకుని కోడల్ని పుట్టింటికి పంపేశారు.

ఇదిలా ఉండగా గత నెల 20న గల్ఫ్ నుంచి వచ్చిన సతీష్ కు జరిగిన విషయం తెలియడంతో మానసికంగా కుంగిపోయాడు. మద్యానికి బానిస కావడంతో తల్లిదండ్రులు అతనిని కేశవదాసుపాలెంలో ఉన్న పెద్దక్క ఇంటికి పంపారు. అక్కడ నుంచి సతీష్ ఈ నెల 29న భార్యకు ఫోన్ చేశాడు. 

అన్న చేతిలో అవమానం... మనస్తాపంతో నిండు గర్భిణి ఆత్మహత్య

పాలకొల్లు మండలం వెలివెలలోని తన పెద్దమ్మ నాగలక్ష్మి ఇంటి వద్ద ఉన్నానని భార్య చెప్పడంతో పిల్లలతో కలిసి అక్కడికి వెళ్లాడు. జరిగిన సంగతి మరిచిపోయి కలిసి బతుకుదామని చెప్పడంతో సంధ్య కూడా ఒప్పుకుంది. 

ఆ తరువాతే భార్యను ఆత్మహత్యకు సిద్ధం చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు తండ్రికి సంధ్య వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ చేసింది. సతీష్ కుటుంబం అదృశ్యమైనట్లు శనివారమే కలకలం రేగింది. 

వారి బైక్, పిల్లల బట్టలు ఘటనా స్థలంలో లభించడంతో వటిని గుర్తు పట్టిన సతీష్ పెద్ద బావ కుడుపూడి పల్లయశెట్టి, పాలకొల్లు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాలకొల్లు రూరల్ సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫణీంద్ర, వాళ్ల కుటుంబ సభ్యుల కారణంగానే తామంతా చనిపోతున్నట్లు సంధ్య రాసిన ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios