Asianet News TeluguAsianet News Telugu

వాలంటీర్లకు పరీక్షలు.. ఏపీ సర్కార్ నోటిఫికేషన్, ఉత్తీర్ణత సాధిస్తేనే

ఈ నెల 28 నుంచి 30 వరకు ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించనుంది. ఈ  మేరకు పరీక్ష నిర్వహణపై నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీపీఎస్సీ. మొత్తం 100 మార్కులకు 40 మార్కులు వస్తేనే ప్రోబేషనరీకి అర్హులని ప్రభుత్వం  తెలిపింది

exams for village and ward volunteers in andhra pradesh
Author
Amaravati, First Published Sep 10, 2021, 4:12 PM IST

ఈ నెల 28 నుంచి 30 వరకు ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించనుంది. ఈ  మేరకు పరీక్ష నిర్వహణపై నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీపీఎస్సీ. పబ్లిక్ సర్వీస్ కమీషన్ వెబ్‌సైట్‌లో ఓటీపీఆర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని .. ఓటీపీఆర్‌లో వచ్చే యూజర్ ఐడీతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం వుంది. ఈ నెల 13 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. మొత్తం 100 మార్కులకు 40 మార్కులు వస్తేనే ప్రోబేషనరీకి అర్హులని ప్రభుత్వం  తెలిపింది. అక్టోబర్ 2 నాటికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు రెండేళ్లు పూర్తి కానుంది. ఏపీ వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 1.34 లక్షల మంది ఉద్యోగులకు ప్రొబేషన్ పూర్తి కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios