టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సారథ్యంలోని ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ సిబ్బంది ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులకు దిగారు. ఈ సందర్భంగా చెరుకూరు శ్రీధర్ బ్యాంక్ లాకర్లలో కిలోలకొద్ది బంగారం పట్టుబడింది.

టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సారథ్యంలోని ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ సిబ్బంది ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులకు దిగారు. ఈ సందర్భంగా చెరుకూరు శ్రీధర్ బ్యాంక్ లాకర్లలో కిలోలకొద్ది బంగారం పట్టుబడింది. 9.5 కిలోల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల బంగారు నాణేలు, రూ.కోటిన్నర విలువైన బంగారు కడ్డీలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, గుంటూరు సహా 9 ప్రదేశాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మాజీ ఎంపీ రాయపాటితో పాటు శ్రీధర్ బ్యాంక్ లాకర్లను ఈడీ అధికారులు తెరిచారు.