Asianet News TeluguAsianet News Telugu

గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలు: ఈసీ ఉత్తర్వులు

ఏపీ రాష్ట్రంలో గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీల నియామకంపై ఎన్నికల కమిషన్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 

EC issues orders on governor  quota MLCs lns
Author
Guntur, First Published Jun 16, 2021, 12:37 PM IST

అమరావతి:ఏపీ రాష్ట్రంలో గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీల నియామకంపై ఎన్నికల కమిషన్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ కోటాలో  నలుగురు ఎమ్మెల్సీల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం నలుగురి పేర్లను సిఫారసు చేసింది.  ఈ నలుగురి పేర్లకు సంబంధించి ఇద్దరి పేర్లను గవర్నర్  అభ్యంతరం తెలపడంతో ఏపీ సీఎం జగన్ గవర్నర్ తో భేటీ అయ్యారు. 

also read:గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలు: ఆమోదించిన బిశ్వభూషణ్

చంద్రబాబు ప్రభుత్వ హయంలో కూడ క్రిమినల్ కేసులున్నవారిని ఎమ్మెల్సీలుగా నియమించిన విషయాన్ని ఏపీ సర్కార్ గుర్తు చేసింది. గవర్నర్ తో భేటీ అయిన కొద్ది నిమిషాల్లోనే నలుగురు ఎమ్మెల్సీలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.  ఈ నలుగురి పేర్లకు గవర్నర్ ఆమోదం తెలపడంతో  ఎన్నికల కమిషన్ బుధవారం నాడు  ఎమ్మెల్సీల ఉత్తర్వులు విడుదల చేసింది.  తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోషన్ రాజు, రమేష్ యాదవ్ లను ఎమ్మెల్సీలుగా నియమితులైనట్టుగా ఈసీ తెలిపింది. 

గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నలుగురికి జగన్  ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios