కూలీ డబ్బులు అడిగితే డ్రైవర్ను చంపాడు
చిత్తూరు మండలం కృష్ణాపురంలో దారుణం చోటు చేసుకొంది. కూలీ డబ్బులు అడిగినందుకుగాను చంద్రానాయక్ అనే వ్యక్తి ఇద్దరిని చంపాడు.
మదనపల్లె: చిత్తూరు మండలం కృష్ణాపురంలో దారుణం చోటు చేసుకొంది. కూలీ డబ్బులు అడిగినందుకుగాను చంద్రానాయక్ అనే వ్యక్తి ఇద్దరిని చంపాడు.
చిత్తూరు జిల్లా మండలం కృష్ణాపురంలో చంద్రానాయక్ అనే వద్ద ఓ వ్యక్తి డ్రైవర్గా పనిచేసేవాడు. అయితే కూలీ డబ్బులను అడిగారు. కూలీ డబ్బులను అడిగినందుకు గాను చంద్రానాయక్ ట్రాక్టర్ను ఢీకొట్టి చంపాడు.
ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్తో పాటు నాగభూషణం కూడ మృతి చెందారు. ఈ ఘటన గ్రామంలో సంచలనానికి కారణమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.