Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రంలో బాబాయ్ మర్డర్ పై సిబిఐ విచారణ- డిల్లీకి జగన్... మతలబేంటో?: దేవినేని ఉమ

టీడీపీ ప్రభుత్వంలో పోలవరం పునాదులే లేవలేదని చెప్పినవారు ఈరోజు గేట్లు ఎలా పెడుతున్నారో చెప్పాలన్నారు మాజీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమ. 

devineni uma sensational comments on cm jagan delhi tour akp
Author
Vijayawada, First Published Jun 11, 2021, 3:15 PM IST

విజయవాడ: పోలవరం జాతీయ ప్రాజెక్ట్ పూర్తిచేయడానికి టీడీపీ ప్రభుత్వం అహోరాత్రాలు శ్రమించిందని...  రూ.11,600 కోట్లకుపైగా ఖర్చుపెట్టి 72శాతం పనులు పూర్తిచేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. స్పిల్ వే దాటి, స్పిల్ ఛానల్ ద్వారా గోదావరి వరద ప్రవాహమంతా మెయిన్ స్ట్రీమ్ లో కలిసేలా చేయడం జరిగిందన్నారు. 2019 జూలైలో ఆ విధంగా పారుతున్న నీటిని, అక్కడ జరిగిన నిర్మాణ పనులను అన్నిప్రసార మాధ్యమాలు చూపించాయన్నారు మాజీ నీటిపారుదల మంత్రి. 

 స్పిల్ వే, కాపర్ డ్యామ్ నిర్మాణం సహా, మెజారిటీ పనులన్నీ గతంలో టీడీపీ ప్రభుత్వమే చేయడం జరిగిందన్నారు దేవినేని ఉమ. ప్రాజెక్ట్ పరిధిలోని 18,500నిర్వాసిత కుటుంబాలను ఖాళీ చేయించాక కాపర్ డ్యామ్ పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ పూర్తిచేయాలంటే విధిగా 18,500 కుటుంబాలను ఖాళీ చేయించాల్సి ఉందన్నారు.

ఈ ప్రభుత్వం రెండేళ్లలో రూ.880కోట్ల వరకు ఖర్చుపెట్టి, పోలవరం ప్రాజెక్ట్ లో ఎందుకు నీటిని నిల్వ చేయలేకపోయిందన్నారు. 18,500 నిర్వాసిత కుటుంబాలకు ఇస్తానన్న రూ.10లక్షల పరిహారం ఏమైందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం గడిచిన రెండేళ్లలో ఎన్ని నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేసిందో చెప్పాలన్నారు. ఆఖరికి నిర్వాసితులకు చెందాల్సిన సొమ్మునికూడా ఈ ప్రభుత్వం దిగమింగుతోందని టీడీపీ ఇప్పటికే ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగిందని మండిపడ్డారు. 

మచ్చా మహాలక్ష్మీ, మదకం సావిత్రి వంటివారు ఎందరున్నారో... వారి పేర్లతో కాజేసిన రూ.2కోట్లకుపైగా సొమ్ము ఏమైందో చెప్పాలన్నారు.  పేద, గిరిజనులకు దక్కాల్సిన సొమ్మునికూడా ఈ ప్రభుత్వం దిగిమింగుతోందంటే అంతకంటే దారుణం మరోటి ఉండదన్నారు. రెండేళ్ల ఈ ప్రభుత్వ పాలనలో ప్రాజెక్ట్ పరిధిలో హెడ్ వర్క్స్ పనులు ఎంత జరిగాయో చెప్పాలన్నారు. తమ ప్రభుత్వంలో చేసిన పనులు వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడించేవారమని, సెంట్రల్ వాటర్ కమిషన్ కు పంపేవారిమని, ఎప్పటికప్పుడు పనులు వివరాలు ఆన్ లైన్లో ఉంచేవారమని,  అలాచేసే దమ్ము,ధైర్యం ఈ ప్రభుత్వానికి ఎందుకులేవని దేవినేని ప్రశ్నించారు.  

read more  జైలుకు పంపిస్తారనే భయంతోనే...: జగన్ డిల్లీ పర్యటనపై యనమల సంచలనం

ఈ రెండేళ్లలో ఏ రోజైనా ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఒక్కరోజుకూడా చెప్పింది లేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పోలవరం పునాదులే లేవలేదని చెప్పినవారు, ఈరోజు గేట్లుఎలా పెడుతున్నారో చెప్పాలన్నారు. రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి, ప్రాజెక్ట్ పనులన్నీ ఒకే కంపెనీకి కట్టబెట్టారని... అలాంటివారు రూ.700కోట్లవరకు ఆదాచేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. గోదావరి నీటిని 6.69కిలోమీటర్లు తిప్పించామని అంటున్నారు... ఎక్కడ నుంచి ఎటు తిప్పారో చెప్పాలన్నారు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా 18,500ల కుటుంబాలను ముంచేయడానికి  ఈప్రభుత్వం సిద్ధమైందన్నారు.  

టీడీపీ ప్రభుత్వం చేసిన పనిని ప్రజలకు చెప్పకుండా బడాయికబుర్లతో కాలయాపన చేస్తూ ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఖర్చుపెట్టిన రూ.11వేలకోట్ల పైచిలుకు సొమ్ములోనే రూ.4వేలకోట్లకు పైగా సొమ్ముని ఈ ప్రభుత్వ కేంద్రంనుంచి తెచ్చుకుందన్నారు. ఆ సొమ్ములో గిరిజనులకు ఎంత ఖర్చుపెట్టారో చెప్పాలన్నారు. 

సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర జలవనరుల శాఖా మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశాడంటున్నారని... కలిసి ఏంసాధించాడో, ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంతసొమ్ము రాబట్టబోతున్నాడో చెప్పాలన్నారు. రూ.55,548కోట్ల వరకు పోలవరం ప్రాజెక్ట్ డీపీఆర్ 2కు టీడీపీ ప్రభుత్వంలోనే కేంద్రం ఆమోదం పొందడం జరిగిందన్నారు. దానిపై ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు కొత్తగా ఆమోదింపచేయాల్సిన అవసరం ఏముందన్నారు. ఢిల్లీ వెళ్లిన జగన్ నిజంగానే పోలవరం డీపీఆర్ కు ఆమోదం పొందేలాచేస్తున్నాడని అందరం భావించామని... కానీ తనకేసులు, బాబాయ్ మర్డర్ కేసు వ్యవహారమే ఆయనకు సరిపోయిందన్నారు.

పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ని ఈ ముఖ్యమంత్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా మార్చాడన్న ఉమా, పట్టిసీమ దండగన్న వ్యక్తే, మరో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముకి రూ.913కోట్లు ఎందుకు కేటాయించాడన్నారు. ముఖ్యమంత్రి పోలవరానికి నిధులివ్వాల్సిందేనని కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నాడో, రాష్ట్ర సమస్యలను ప్రధాని ముందుంచి, ఆయన్ని ఎందుకు ఒత్తిడిచేయడంలేదో చెప్పాలన్నారు. రాష్ట్ర విభజన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని, విద్యుత్ బకాయిలకు సంబంధించి పొరుగు రాష్ట్రంనుంచి రావాల్సిన బకాయిలను కూడా రాబట్టుకోలేకపోయాడన్నారు. తన పార్టీ ఎంపీలతో ఏం లాబీయింగ్లు చేస్తున్నాడో ముఖ్యమంత్రే చెప్పాలన్నారు దేవినేని ఉమ. 

 గంగవరం పోర్ట్ అభివృద్ధి పనులకు ఎంత నిధులు కేంద్రం నుంచి వస్తాయో చెప్పగల ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని ఉమా నిలదీశారు. ఒక్కరాజధాని కట్టలేని ఈ ముఖ్యమంత్రికి మూడు రాజధానులు కావాల్సి వచ్చాయని మాజీమంత్రి ఎద్దేవా చేశారు. రాజధాని పేరుతో విశాఖలోని పరిశ్రమలు, భూములు స్వాహా చేయాలన్న కుతంత్రంతో వ్యవహరిస్తున్నాడన్నారు.  ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి తెస్తానన్న ప్రత్యేకహోదా ఏమైంది? అని ప్రశ్నించారు. 

బూతుల మంత్రి బూతులు మాట్లాడటం మానేసి ధాన్యపు రైతులకు చెల్లించాల్సిన బకాయిల గురించి చెప్పాలన్నారు. 542రోజులుగా అమరావతి కోసం 29వేల మంది రైతులు, వారి కుటుంబాలు చేస్తున్న నిరసన దీక్షలు ఈ ముఖ్యమంత్రికి ఎందుకు పట్టడంలేదన్నారు. జగన్మోహ న్ రెడ్డికి ఏమాత్రం దమ్ము, ధైర్యమున్నా మీడియా ముందుకొచ్చి తన ఢిల్లీ పర్యటన వివరాలను ప్రజలకు వెల్లడించాలని దేవినేని డిమాండ్ చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios