Asianet News TeluguAsianet News Telugu

మీరు, మీ నాన్న కూడా పాదయాత్రలు చేసి సీఎం పదవి చేపట్టారు: జగన్ పై సీపీఐ నారాయణ

మీరు, మీ నాన్న కూడా పాదయాత్రలు చేసి సీఎం అయ్యారని  ఏపీ సీఎం జగన్ నుద్దేశించి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గుర్తు చేశారు. ర్యాలీలు, పాదయాత్రలంటే జగన్ కు ఎందుకంత కోపమని ఆయన ప్రశ్నించారు. 

CPI National Secretary Narayana Comments On AP CM YS Jagan
Author
First Published Sep 12, 2022, 11:02 AM IST | Last Updated Sep 12, 2022, 11:08 AM IST

అమరావతి: పాదయాత్రలు, ర్యాలీలంటే ఏపీ సీఎం జగన్ కు ఎందుకంత కోపమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ ప్రశ్నించారు. సోమవారం నాడు సీపీఐ నారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతే ఏపీకి  రాష్ట్ర రాజధాని అనే విషయానికి జగన్ ఒప్పుకున్నారని నారాయణ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సీఎం అయ్యాక జగన్ గుణం మారిందని ఆయన విమర్శించారు. సీఎం పదవి నుండి దిగిపోవాలని అమరావతి రైతులు పాదయాత్ర చేయడం లేదని  నారాయణ చెప్పారు. అమరావతే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు పాదయాత్ర చేస్తున్నారని నారాయణ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మీరు, మీ నాన్న కూడ పాదయాత్రలు చేసిన తర్వాతే సీఎం పదవిని చేపట్టారని నారాయణ గుర్తు చేశారు.

also read:అమరావతి నుండి అరసవెల్లి:ప్రారంభమైన రైతుల మహ పాదయాత్ర

అమరావతిలోని వెంకటేశ్వరస్వామి ఆలయం నుండి అరసవెల్లి  వరకు అమరావతి రైతుల పాదయాత్ర ఇవాళ ప్రారంభమైంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని  అమరావతి రైతులు చేపట్టినఆందోళనలు వెయ్యి రోజులు పూర్తైన నేపథ్యంలో అమరావతి రైతులు  పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతిని ఇచ్చింది. గత మాసంలోనే ఈ పాదయాత్రకు అనుమతి కోరుతూ రైతులు  పోలీసులను కోరారు. కానీ ఈ పాదయాత్రకు అనుమతివ్వకపోవడంతో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రైతులు.ఈ నెల 9వ తేదీన ఏపీ హైకోర్టులో అమరావతి రైతులకు ఏపీ హైకోర్టు అనుమతిని ఇచ్చింది. 

సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది.  ఈ పాదయాత్రలో సుమారు 600 మంది రైతులు పాల్గొంటారు. పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని అరసవెల్లిలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios