Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’

మ్యాన్ అఫ్ ది మ్యాచ్, ఆంధ్రా అసెంబ్లీ బడ్జెట్  సమావేశాల్లో  8 గంటల 19 నిమిషాలు మాట్లాడిన  మహోపన్యాసకుడు ఆయనే...

chandrababu Naidu emerges top speaker  in Andhra Assembly

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  అమరావతి తొలి అసెంబ్లీ సమావేవంలో మహోపన్యాసకుడిగా నిలిచారు.అసెంబ్లీలో మాట్లాడటంలో ఆయనకెవరూ సాటిలేరని రుజువయింది. సభలో ఎవరెవరు ఎంతసేపు మాట్లాడారో లెక్కలు వెలువడ్డాయి. ఈ రోజు విపరీతమయిన గొడవ మధ్య ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది.

 

ఈ బడ్జెట్ సమావేశాలు 14 రోజులు జరిగాయి. శాసనసభ 57 గంటల 17 నిమిషాలు పనిచేసింది. ఈ సమావేశాల్లో 21 బిల్లులకు ఆమోదం లభించింది. స్టార్‌ ప్రశ్నలు-43, 25 ప్రశ్నలు సభ ముందుకొచ్చాయి.

 

రూల్‌ 344 కింద 2 అంశాలపై చర్చజరిగింది. మంత్రుల 4 స్టేట్‌మెంట్లు ఇచ్చారు.  అలాగే ప్రభుత్వం మూడు తీర్మానాలు ప్రవేశపెట్టింది. సభలో 47 మంది సభ్యులు వివిధ అంశాలపై మాట్లాడారు.

 

సభ  57.17 గంటలు పనిచేస్తే ,  అధికార టీడీపీ 42 గంటల 9 నిమిషాలు పాటు ఉపన్యాసాలు వినిపించింది. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు- 8 గంటల 19 నిమిషాలు మాట్లాడి నెంబర్ వన్ గా నిలిచారు.

 

ప్రతిపక్ష వైసీపీ 12 గంటల సమయం లభిస్తే, జగన్‌ 3 గంటల 46 నిమిషాల మాత్రమే మాట్లాడగలిగారు. ఇక బీజేపీ 3 గంటల 32 నిమిషాల సమయం కేటాయిస్తే, వైజాగ్ శాసన సభ్యడు విష్ణుకుమార్‌రాజొక్కరే 3 గంటల 13 నిమిషాలు మాట్లాడారు.

 

ఇంత గొడవ జరిగినా, సభలో వృధా అయిన సమయం ఎంతో తెలుసా...కేవలం గంట 53 నిమిషాలు మాత్రమే. ఇందులో వైసీపీ గంట 49 నిమిషాలు, టీడీపీ 4 నిమిషాల సమయాన్ని వృథా చేసిందని అసెంబ్లీ లెక్కలు చెబుతున్నాయి.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios