Achyuthapuram SEZ: అచ్యుతాపురం సెజ్లో గ్యాస్ లీకేజీకి బాధ్యులైన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. బాధిత కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు.
N Chandrababu Naidu: విశాఖపట్నంలోని లేబొరేటరీలో గ్యాస్ లీక్ అయి దాదాపు 200 మంది కార్మికులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కార్మికులకు అవసరమైన అన్నిరకాల మెరుగైన వైద్యం అందించాలన్నారు. అచ్యుతాపురం సెజ్లో గ్యాస్ లీకేజీకి బాధ్యులైన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో భారీ ప్రాణనష్టం జరిగినా ఫ్యాక్టరీల యాజమాన్యం, ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ శాఖల వైఫల్యం, పర్యవేక్షణ లేకపోవడం ప్రజలకు శాపంగా మారిందని విమర్శించారు.
ఫ్యాక్టరీలలో గ్యాస్ లీక్ ఘటనలను అరికట్టడంలో ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం మండిపడ్డారు. ఇదిలావుండగా, విశాఖపట్నంలోని ల్యాబొరేటరీలో గ్యాస్ లీక్ ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడంతో కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే ప్రమాద స్థలాన్ని సందర్శించాలని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని అచ్యుతాపురంలోని లేబొరేటరీలో గ్యాస్ లీక్ కావడంతో శుక్రవారం 178 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పోరస్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్లో లీక్ అయిన విష వాయువును పీల్చుకున్న తర్వాత కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం ప్రారంభంలో బాధితుల సంఖ్య 87 గా ఉండగా, సాయంత్రానికి 178కి పెరిగింది. అంతకుముందు శుక్రవారం, పోలీసు సూపరింటెండెంట్ గౌతమి సాలి మాట్లాడుతూ కార్మికులను ఆసుపత్రికి తరలించామని మరియు వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఘటన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఘటన వివరాలను అడిగి తెలుసుకుని అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
యూనిట్లో పనిచేస్తున్న మహిళలను బయటకు తరలించగా పరిస్థితి సద్దుమణిగిందని, అస్వస్థతకు గురైన వారు ప్రమాదం నుంచి బయటపడ్డారని అధికారులు తెలిపారు. విచారణ జరుగుతోంది. లీక్కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
