Asianet News TeluguAsianet News Telugu

తిరుపతి ఎంపీ స్థానానికి ఉపఎన్నిక: టీడీపీ, వైసీపీ అభ్యర్ధుల ప్రకటన, ఇంకా ఖరారు చేయని బీజేపీ

తిరుపతి ఎంపీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధులను టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ (వైసీపీ)లు ప్రకటించాయి. బీజేపీ ఇంకా అభ్యర్ధిని ప్రకటించాల్సి ఉంది.

BJP not finalised for Tirupati MP Segment by polls lns
Author
Tirupati, First Published Mar 16, 2021, 7:32 PM IST


తిరుపతి: తిరుపతి ఎంపీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధులను టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ (వైసీపీ)లు ప్రకటించాయి. బీజేపీ ఇంకా అభ్యర్ధిని ప్రకటించాల్సి ఉంది.

తిరుపతి ఎంపీ  బల్లి దుర్గాప్రసాద్ గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.

2019 ఏప్రిల్ లో తిరుపతి ఎంపీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఉప ఎన్నికల్లో కూడ పనబాక లక్ష్మి మరోసారి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు.

ఈ స్థానం నుండి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తిని  ఆ పార్టీ బరిలోకి దింపనుంది. జగన్ పాదయాత్రలో డాక్టర్ గురుమూర్తి కీలకంగా వ్యవహరించారు. ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో గురుమూర్తిని ఆ పార్టీ బరిలోకి దింపుతున్నట్టుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.

ఇదే స్థానం నుండి బీజేపీ, జనసేన కూటమి అభ్యర్ధి బరిలోకి దిగనున్నారు. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధి బరిలోకి దింపనుంది. అయితే బీజేపీ ఎవరిని అభ్యర్ధిగా దింపుతోందోననే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios