Asianet News TeluguAsianet News Telugu

పేరెంట్స్ చేతిలో కూతుళ్ల హత్య: మరిన్ని విస్తుపోయే విషయాలు

చిత్తూరు జిల్లాలో కూతుళ్లను చంపిన తల్లిదండ్రుల ఘటనలో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. తల్లిదండ్రులు క్షుద్రపూజలు చేసి ఇద్దరు కూతుళ్లను హత్య చేశారు.

Astonishing incidents in Chittoor district sisters killing
Author
Chittoor, First Published Jan 25, 2021, 11:59 AM IST

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన కూతుళ్ల హత్య కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తంనాయుడు ఆదివారం రాత్రి క్షుద్రపూజల్లో భాగంగా తమ ఇద్దరు కూతుళ్లను అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

కూతుళ్లంటే తండ్రి అమితమైన ప్రేమ. కానీ మూఢవిశ్వాసం వారి ప్రాణాలను తీసేందుకు పురికొల్పింది. ఇద్దరు కూతుళ్ల వినోద పర్యటనకు కూడా పురుషోత్తంనాయుడు ఏర్పాట్లు చేశారని, వారిని జోగ్ వాటర్ ఫాల్స్ చూసేందుకు ఆ పర్యటన ఏర్పాట్లు చేశారు. కానీ మూఢ విశ్వాసంతో వారి ప్రాణాలు తీశాడు.

See Video: ఉన్మాద భక్తి: వయసొచ్చిన కూతుళ్లను చంపిన తల్లి, తండ్రి సాక్షి

తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తం నాయుడు ఇప్పటి కూడా ఇంటి మేడపైనే ఉన్నారు. వారు పోలీసుల అదుపులో ఉన్నారు. తమ కూతుళ్లు తెల్లారేసరికి తిరిగి బతికి వస్తారని, తాము వారిని బతికించుకుంటామని రాత్రి సంఘటన తర్వాత తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. 

వారం క్రితం ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిసిందే. ఆ ప్రత్యేక పూజలు ఎవరి చేతుల మీదుగా జరిగాయనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. కరోనా సమయంలో కుటుంబం యావత్తూ ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా మిమ్మల్ని చంపి, తిరిగి బతికిస్తామని తల్లిదండ్రులు కూతుళ్లకు చెప్పినట్లు తెలుస్తోంది. కూతుళ్లు కూడా మూఢ భక్తి కారణంగా అందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు.

Also Read: కూతుళ్ల బలి కేసు..దుస్తులు విప్పేసి, నగ్నం చేసి.. విస్తుపోయే విషయాలు

పురుషోత్తంనాయుడిలో గానీ పద్మజలో గానీ ఏ విధమైన మానసిక సమస్యలను తాము గుర్తించలేదని స్థానికులు అంటున్నారు. చాలా బాగా మాట్లాడేవారని చెబుతున్నారు. కుటుంబ సభ్యులు మెహర్ బాబా ఆశ్రమానికి వెళ్లివచ్చారని అంటున్నారు. పురుషోత్తంనాయుడు షిర్డీ సాయిబాబా భక్తుడని అంటున్నారు. జగ్గీ వాసుదేవ్ ఆశ్రమానికి కూడా వెళ్లి వచ్చారని సమాచారం.  

క్షుద్రపూజలు చేసి తల్లిదండ్రులు తమ ఇద్దరు కూతుళ్లను అత్యంత దారుణంగా చంపేసిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు విద్యావంతులే. కానీ క్షుద్రపూజల మాయలో పడి ఇద్దరు కూతుళ్లను మట్టుబెట్టారు. చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీలో గల శివనగర్ లో ఆదివారం రాత్రి ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. 

శివనగర్ కు చెందిన ఎన్. పురుషోత్తంనాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య పద్మజ ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్ గా, ప్రిన్సిపాల్ గా పనిచేస్తోంది. వారికి అలేఖ్య (27), సాయిదివ్య (22 అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

వారిలో పెద్ద కూతురు అలేఖ్య భోపాల్ లో పీజీ చేస్తోంది. చిన్న కూతురు బీబీఏ పూర్తి చేసి ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది. కుటుంబ సభ్యులంతా నిరుడు ఆగస్టులో శివనగర్ లో కట్టిన ఇంట్లోకి వచ్చారు. ఇంట్లో తరుచుగా పూజలు చేసేవారని అంటుారు. 

ఆ క్రమంలోనే ఆదివారం రాత్రి కూడా ఇంట్లో నిర్వహించి తొలుత చిన్నకూతురును శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్ద కూతురు నోట్లో రాగి చెంబు పెట్టి డంబెల్ తో కొట్టి చంపేశారు. ఈ విషయానని పురుషోత్తంనాయుడు తాను పనిచేస్తు్న కళాశాలలో ఓ అధ్యాపకుడికి చెప్పాడు. దీంతో అతను ఇంటి వద్దకు వచ్చి పరిస్థితిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

హత్యకు గురైనవారితో పాటు హంతకులు కూడా దైవభక్తిలో లీనమై పోయారని, వారు తమ బిడ్డలు మళ్లీ బతుకుతారని చంపేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ అన్నాైరు. తల్లి పద్మజ బిడ్డలను కొట్టి చంపిందని, ఆ సమయంలో తండ్రి పురుషోత్తంనాయుడు అక్కడే ఉన్నాడని డిఎస్పీ చెప్పారు. 

తల్లిదండ్రులు కూడా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించామని, వారు అఘాయిత్యం చేసుకోకుండా ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. మంత్రతంత్రాలకు అలవాడు ఆ దారుణానికి ఒడిగట్టారని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios