సమ్మెకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.. మా ఆగ్రహం ఎలా వుంటుందో బొత్సకు చూపిస్తాం : సూర్యనారాయణ
డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) సమ్మెకు సిద్ధమైంది. ప్రభుత్వం దిగిరాకుంటే నవంబర్ 1 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని.. ఉద్యోగుల ఆగ్రహం ఎలా వుంటుందో మంత్రి బొత్స సత్యనారాయణకు చూపిస్తామని సూర్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
![apgea ready for strike says president suryanarayana ksp apgea ready for strike says president suryanarayana ksp](https://static-ai.asianetnews.com/images/01fsphgr22dcgyp3jg25bpskgv/suryanarayana-new-jpg_363x203xt.jpg)
తమ డిమాండ్ల సాధన కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. వీరికి నచ్చచెప్పేందుకు ప్రభుత్వం పలుమార్లు చర్చలకు పిలిచింది. ఈ వారం కూడా మంత్రివర్గ ఉపసంఘంతో ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి. ఈ పరిస్ధితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) సమ్మెకు సిద్ధమైంది. దీనిలో భాగంగా మే 5న సీఎస్ జవహర్ రెడ్డికి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆదివారం విజయవాడలో జరిగిన ఏపీజీఈఏ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు.
ALso Read: ఉద్యోగ సంఘం గుర్తింపు రద్దుకు నోటీస్: హైకోర్టులో సవాల్ చేసిన సూర్యనారాయణ
ఈ సందర్భంగా ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రెండు దశల్లో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపడతామన్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే నవంబర్ 1 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని.. ఉద్యోగుల ఆగ్రహం ఎలా వుంటుందో మంత్రి బొత్స సత్యనారాయణకు చూపిస్తామని సూర్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఉద్యమ కార్యాచరణ ఇదే
- మే 22న జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు
- జూన్ 14న సీపీఎస్ రద్దు కోసం జిల్లా కేంద్రాల్లో పోరాటం
- జూలై 5,6న నంద్యాల, కర్నూలులో బహిరంగ ప్రదర్శనలు
- అక్టోబర్ 31న చలో విజయవాడ , బహిరంగ సభ