Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్‌లో చిక్కుకొన్న 5 వేల మత్స్యకారులు ఏపీకి: విజయ్ రూపానీకి జగన్ ఫోన్

గుజరాత్ రాష్ట్రంలోని వేరావల్‌లో చిక్కుకొన్న ఏపీ రాష్ట్రానికి చెందిన మత్స్యకారులను ఆంధ్రప్రదేశ్ కు సముద్రమార్గం ద్వారా రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారంనాడు ఫోన్ లో మాట్లాడారు.
 

ap plans to bring fishermen from gujarat:Ap Cm Phoned to Gujarat Cm Vijay Rupani
Author
Amaravathi, First Published Apr 23, 2020, 11:51 AM IST

అమరావతి: గుజరాత్ రాష్ట్రంలోని వేరావల్‌లో చిక్కుకొన్న ఏపీ రాష్ట్రానికి చెందిన మత్స్యకారులను ఆంధ్రప్రదేశ్ కు సముద్రమార్గం ద్వారా రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారంనాడు ఫోన్ లో మాట్లాడారు.

గుజరాత్ రాష్ట్రంలోని వేరావల్ గ్రామంలో ఏపీ రాష్ట్రంలోని  ఐదువేల మత్స్యకారులు చిక్కుకొన్నారు.గత ఏడాది ఆగష్టు మాసంలో వీరంతా గుజరాత్ రాష్ట్రానికి వలస వెళ్లారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసం వరకు వారంతా సముద్ర జలాల్లోనే చేపల వేట కొనసాగిస్తారు. ఎనిమిది నెలల పాటు వీరంతా సముద్రంలోనే గడుపుతారు. నెలలో కనీసం 25 రోజుల పాటు వారంతా సముద్రంలోనే ఉంటారు. ఆ తర్వాతే వారు ఒడ్డుకు చేరుకొంటారు.

గత 25 రోజుల నుండి వారంతా సముద్రంలో చేపల వేటకు వెళ్లలేదు. దీంతో బోటు యజమానులు వారికి జీతాలు ఇవ్వలేదు. దుర్భర జీవితం గడుపుతున్నట్టుగా మత్స్యకారులు తమ కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా చెప్పారు.

వీరు ఉంటున్న  ప్రాంతంలో మురికి కాలువ ఉంది. ఈ మురికి కాలువ కారణంగా దోమలు విపరీతంగా ఉన్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. కనీసం తాగేందుకు కూడ మంచినీళ్లు లేని పరిస్థితులు ఉన్న విషయాన్ని వారు శ్రీకాకుళం జిల్లా అధికారులకు చెప్పారు.దీంతో అనారోగ్యానికి గురైన ఎచ్చెర్ల మండలానికి చెందిన కామరాజ్ అనే మత్స్యకారుడు మంగళవారం నాడు రాత్రి మృతి చెందాడు. ఈ విషయాన్ని బుధవారం నాడు ఉదయం మత్స్యకారులు మంత్రి మోపిదేవి వెంకటరమణకు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు సమాచారం ఇచ్చారు.

also read:లాక్‌డౌన్ దెబ్బ:గుజరాత్‌లో చిక్కుకొన్న శ్రీకాకుళం మత్స్యకారుడు మృతి

ఏపీ రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు దుర్భర పరిస్థితుల్లో ఉన్న విషయం  తెలుసుకొన్న సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు ఉదయం మరోసారి గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో మాట్లాడారు. 

మూడు రోజలు వ్యవధిలో గుజరాత్ సీఎంతో ఏపీ సీఎం జగన్ రెండు దఫాలు మాట్లాడారు. సముద్ర మార్గం ద్వారా ఏపీకి చెందిన మత్స్యకారులను ఏపీకి రప్పించాలని కోరారు. ఈ మేరకు గుజరాత్ సీఎం రూపానీ కూడ సానుకూలంగా స్పందించారు. గుజరాత్ నుండి ఏపీ రాష్ట్రానికి ఐదు వేల మత్స్యకారులు వచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

వేరావల్ లో చిక్కుకొన్న మత్స్యకారుల్లో ఇప్పటికే ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే.దీంతో మత్స్యకారులను ఏపీకి రప్పించాలని సర్కార్ నిర్ణయం తీసుకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios