Asianet News TeluguAsianet News Telugu

పిపిఎల సమీక్షపై విద్యుత్ సంస్థలకు హైకోర్టు షాక్

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పీపీఏల సమీక్ష విషయంలో ఏపీ హైకోర్టు సమర్ధించింది. ఈ విషయంలో ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు సాకిచ్చింది హైకోర్టు.

ap high court shocks to private electricity companies on ppa
Author
Amaravati, First Published Sep 24, 2019, 3:54 PM IST

అమరావతి: ఏపీ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో జారీ చేసిన 63 జీవోను హైకోర్టు రద్దు చేసింది.విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పున:సమీక్షకు ప్రభుత్వం వెళ్లడాన్ని విద్యుత్ సంస్థలు తప్పుబట్టాయి. అయితే విద్యుత్ సంస్థల వాదనతో హైకోర్టు విభేదించింది.

పీపీఏల పున:సమీక్షకు ఏపీఈఆర్‌సీకి వెళ్తామని ప్రభుత్వం చేసిన వాదనతో ఏపీ హైకోర్టు సమర్ధించింది. ఈ కారణంగానే ప్రభుత్వం జారీ చేసిన 63 జీవోను రద్దు చేసింది.

 విద్యుత్ సంస్థలు తమ వాదనలను ఏపీ ఈఆర్‌సీ ఎదుటే విన్పించాలని కూడ హైకోర్టు ఆయా విద్యుత్ సంస్థలను ఆదేశించింది.ఏపీఈఆర్‌సీ తీసుకొనే నిర్ణయాలను తాము నిర్ధారించలేమని కూడ హైకోర్టు తేల్చి చెప్పింది.

మధ్యంతర చెల్లింపుల కింద యూనిట్‌కు రూ.2.44 చెల్లిస్తామని ప్రభుత్వం చేసిన వాదనను ఏపీ హైకోర్టు సమర్ధించింది.ప్రభుత్వమే ఏపీఈఆర్‌సీకి వెళ్తామని చెప్పడంతో ఈ మేరకు జారీ చేసిన 63 జీవోను ఏపీ హైకోర్టు రద్దు చేసింది.

 

సంబంధిత వార్తలు

పీపీఏలపై తప్పుడు ప్రచారం, మేం చెప్పినా వినడం లేదు: జగన్ పై కేంద్రమంత్రి ఆగ్రహం

జగన్ ప్రభుత్వానికి కేంద్రం షాక్

విదేశీ బ్యాంకుల షాక్: పిపిఎల రద్దుపై వెనక్కి తగ్గిన జగన్ సర్కార్

వైఎస్ జగన్ కు జపాన్ కరెంట్ షాక్

పీపీఏల వల్ల రాష్ట్రానికి లాభం లేదు.. అందుకే రద్దు చేశాం: జగన్

జగన్ సర్కార్ కు తలనొప్పిగా పీపీఏల అంశం: హైకోర్టులో మరో రెండు పిటీషన్లు

మోదీ ప్రభుత్వంతో సమరానికి జగన్ సై : అగ్గిరాజేస్తున్న పీపీఏ అంశం

సోలార్, విండ్ కంపెనీల నుంచి విద్యుత్ నిలిపివేత: సీఎం జగన్ సంచలన నిర్ణయం

హైకోర్టులో జగన్ సర్కార్ కు చుక్కెదురు: పీపీఏల పున:సమీక్షకు బ్రేక్

జగన్ సర్కార్ కు అప్పిలేట్ ట్రిబ్యునల్ షాక్


 

Follow Us:
Download App:
  • android
  • ios