Asianet News TeluguAsianet News Telugu

రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మృతిపై విచారణ పున:ప్రారంభం...ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించాలని, రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మృతిపై దర్యాప్తు జరపాలని దాఖలైన పిటిషన్‌పై విచారణను పునఃప్రారంభించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

AP  High Court accepts reinquiry on registrar general rajashekar death petition
Author
Amaravathi, First Published Aug 11, 2020, 10:52 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించాలని, రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మృతిపై దర్యాప్తు జరపాలని దాఖలైన పిటిషన్‌పై విచారణను పునఃప్రారంభించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ కేసులో జడ్జి రామకృష్ణ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసే సమయానికే ఒరిజినల్ పిటిషన్‌పై విచారణ పూర్తిచేసి జడ్జ్‌మెంట్ కోసం హైకోర్టు రిజర్వ్ చేసింది. అయితే ఈ దశలో పిటిషన్‌పై విచారణ పునఃప్రారంభించాలని, తనను ఇంప్లీడ్ చేయాలని జడ్జి రామకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ నేపథ్యంలో విచారణను పునః ప్రారంభించేందుకు హైకోర్టు నిర్ణయించింది. జడ్జి రామకృష్ణ ఇంప్లీడ్ పిటిషన్‌లో ఒక పేరాపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి గురువారం వరకు గడువు ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios