Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో ఉచిత విద్యుత్ కు అంతరాయం...అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

AP CM YS Jagan Review Meeting on free current to farmers
Author
Amaravathi, First Published May 1, 2020, 7:51 PM IST

అమరావతి: కరోనా వైరస్ కారణంగా రైతులకు అందించే ఉచిత విద్యుత్ కు అంతరాయం కలిగిందని... గత ఖరీఫ్‌లో 58శాతం ఫీడర్లలో 9 గంటలపాటు రైతులకు పగటిపూట విద్యుత్‌ ఇవ్వగలిగామని అధికారులు ముఖ్యమంత్రి జగన్ కు తెలిపారు.  ఈ ఖరీఫ్‌లో 81శాతం ఫీడర్లలో 9 గంటలపాటు పగటిపూట విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కోవిడ్‌ –19 కారణంగా సప్లైయిస్ కి ఇబ్బంది కలిగిందని, దీనివల్ల మిగిలిన 19శాతం ఫీడర్లలో పనులు మందగించాయని సీఎంకు తెలిపారు అధికారులు. 

విద్యుత్‌రంగంపై సీఎం వైఎస్‌.జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌పైన అధికారులతో చర్చించినసీఎం కరోనా ప్రభావం విద్యుత్ రంగంపై పడకుండా చూడాలని ఆదేశించారు. పనులు పూర్తిచేసి వచ్చే రబీనాటికి 100శాతం ఫీడర్లలో 9 గంటలు పగటిపూట కరెంటు ఇవ్వాలని అధికారులకు సీఎం స్పష్టంచేశారు. 

10వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ప్లాంట్‌ ఏర్పాటుపై  సీఎం అధికారులతో చర్చించారు. ప్రాజెక్టుకోసం ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను వివరించిన అధికారులు మే నెలాఖరు నాటికి పనులు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 

సీఎంతో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, జెన్ కో చైర్మన్ సాయిప్రసాద్, జెన్‌కో ఎండీ బి.శ్రీధర్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లంతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.  
 
 

Follow Us:
Download App:
  • android
  • ios