పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా మరో పథకానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు మరో పథకానికి శ్రీకారం చుట్టారు.
అమరావతి: పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా మరో పథకానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు మరో పథకానికి శ్రీకారం చుట్టారు.
జగనన్న జీవక్రాంతి పథకాన్ని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుండి సీఎం జగన్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి కల్పించందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పారు.
also read:మరో పథకానికి జగన్ సర్కార్: నేడు జగనన్న జీవ క్రాంతి పథకం ప్రారంభం
వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడం ద్వారా రైతుల్లో మరింత ఆర్ధిక అభివృద్ది రానుందన్నారు. గత ప్రభుత్వాలు ఈ అంశాలను నిర్లక్ష్యం చేశాయన్నారు.అమూల్తో ఒప్పందం చేసుకోవడం ద్వారా పాడి రైతులకు మహిళలకు ఆర్ధికంగా చేయూత అందనుందని సీఎం చెప్పారు.
ఈ పథకం కింద 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేయనున్నామన్నారు. రూ. 1,869 కోట్లను ఈ పథకం కోసం ఖర్చు చేస్తామని సీఎం ప్రకటించారు.45 ఏళ్ల నుండి 60 ఏళ్లలోపు వయస్సున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన మహిళలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేయనున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 10, 2020, 12:16 PM IST