Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వోద్యోగులే: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

బుధవారం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను నాని అమరావతిలో మీడియాకు తెలిపారు. ఆంజనేయరెడ్డి కమిటీ సిఫారసులను కేబినెట్ యధాతథంగా ఆమోదించిందని మంత్రి పేర్కొన్నారు. 

ap cabinet decisions
Author
Amaravathi, First Published Sep 4, 2019, 3:26 PM IST

ఏపీఎస్‌ఆర్టీసీలోని ఉద్యోగస్తులందరినీ రవాణాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోతున్న పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నానీ. బుధవారం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది.

ap cabinet decisions

ఇందులో తీసుకున్న నిర్ణయాలను నాని అమరావతిలో మీడియాకు తెలిపారు. ఆంజనేయరెడ్డి కమిటీ సిఫారసులను కేబినెట్ యధాతథంగా ఆమోదించిందని మంత్రి పేర్కొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ ప్రభుత్వోద్యోగులుగా పరిగణిస్తామని.. ఆర్టీసీలో పనిచేస్తున్న 52 వేల మంది ఉద్యోగస్తులందరినీ కూడా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లోకి రీడిజిగ్నిట్ చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని నాని వెల్లడించారు.

ap cabinet decisions

సర్వీస్ రూల్స్, పే స్కేలు, ఇతర అంశాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వర్తించేలా చేయాలని రవాణా, న్యాయ, ఆర్ధిక, సాధారణ పరిపాలన శాఖలను ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.

ap cabinet decisions

అలాగే ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచేందుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసిందన్నారు. బస్ ఛార్జీలపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బస్ ఛార్జీల నియంత్రణ అథారిటీని ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని నాని తెలిపారు. 

కేబినెట్ నిర్ణయాలు
* ఆశావర్కర్ల వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
*  బందర్ పోర్టుకు కేటాయించిన 412.5 ఎకరాల భూమి వెనక్కి తీసుకోవాలని నిర్ణయం
* మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు
* ఇసుక మాఫియాను అరికట్టేలా కొత్త ఇసుక విధానం
* పోలవరం హైడల్ ప్రాజెక్ట్‌లోని రూ. 3,216.11 కోట్ల పనులకు సంబంధించిన టెండర్ల రద్దు
*  రేపటి నుంచి అమల్లోకి రానున్న కొత్త ఇసుక విధానం.. దీని ప్రకారం.. టన్నుకి రూ.375 ధరగా నిర్ణయం
* తొలి దశలో 58 ఇసుక స్టాక్ పాయింట్లు అందుబాటులోకి రానున్నాయి
* ఏపీఎండీసీ ద్వారా ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్
* దశల వారీగా ఇసుక రీచ్‌లు, స్టాక్ పాయింట్ల పెంపు
* రివర్స్ టెండరింగ్ పద్ధతిలో కొత్త టెండర్లు.. కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్సుల రికవరీకి ఆమోదం
* వ్యవసాయ భూముల్లోని ఇసుక నిక్షేపాలను క్యూబిక్ మీటర్‌కు రూ. 60 చొప్పున కొనుగోలు
* ఇసుక ఎవరైనా నిలవచేస్తే కఠిన చర్యలు
* ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణా నిషేధం
* ఆటోలు, ట్యాక్సీల యజమానులకు ఏడాదికి రూ.10 వేలు పంపిణీ.. దీని వల్ల 4 లక్షల మందికి ప్రయోజనం
* శ్రీరామ నవమి నుంచి వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకం అమలు
* వికలాంగులను పెళ్లి చేసుకుంటే రూ.1.50 లక్షలు కానుక
* భవన నిర్మాణ కార్మికులన పిల్లలను వివాహం చేసుకుంటే రూ. లక్ష
* ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెళ్లికానుకగా రూ.లక్ష
* బీసీలకు పెళ్లి కానుకగా రూ.50 వేలు
* ఈ నెల 10 నుంచి ఇసుక బుకింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం
* పెళ్లి రోజే వైఎస్సార్ పెళ్లి కానుక నగదు అందజేత
* రూ.750 కోట్లతో వైఎస్సార్ పెళ్లి కానుకస
* కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సంగమేశ్వరంలో డీఆర్‌డీవో రాకెట్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయింపు
* బ్యాంకుల విలీనంలో భాగంగా ఆంధ్రాబ్యాంక్‌ పేరును యధాతథంగా ఉంచాలని కేబినెట్ తీర్మానం
* చిత్తూరు, కడప జిల్లాల్లో మూడు చోట్ల ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌కు 25 ఎకరాల స్థలం కేటాయింపు
* నడికుడి-శ్రీకాళహస్తి బ్రాడ్‌గేజ్ రైల్వేలైను నిర్మాణం నిమిత్తం ప్రకాశం జిల్లాలో 20 ఎకరాలు దక్షిణ మధ్య రైల్వేకు కేటాయింపు
* బలిమెల ఘటనలో మరణించిన ఏపీఎస్‌పీకి చెందిన వెంకట్రావు కుటుంబానికి గుంటూరు జిల్లా లాం లో పది సెంట్ల భూమి కేటాయింపు
* తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల సంఖ్యను 16 నుంచి 25కి పెంపు

కాంట్రాక్టర్లకు జగన్ సర్కార్ షాక్: అడ్వాన్స్‌ ల రికవరీ

Follow Us:
Download App:
  • android
  • ios