తానా సభలా..టీడీపీ భజనా సభలా: రామ్మాధవ్కు అవమానంపై కన్నా ఫైర్
తానా సభల్లో బీజేపీ నేత రాంమాధవ్ను అవమానించడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటుగా స్పందించారు. అవి తానా సభలు కాదని.. టీడీపీ భజన సభలంటూ సెటైర్లు వేశారు.
తానా సభల్లో బీజేపీ నేత రాంమాధవ్ను అవమానించడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటుగా స్పందించారు. అవి తానా సభలు కాదని.. టీడీపీ భజన సభలంటూ సెటైర్లు వేశారు.
పచ్చ తమ్ముళ్లు అమెరికాలో కూడా తెలుగువారి ప్రతిష్టను దిగజారుస్తున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంమాధవ్ ప్రసంగానికి అడ్డు తగిలి.. లోకేశ్ గ్యాంగ్ మరోసారి తమ నీచబుద్ధిని బయటపెట్టారని ఫైరయ్యారు.
టీడీపీ బురద రాజకీయాలలోంచే కమల వికాసం జరుగుతుందంటూ లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. తానా 22వ మహాసభలకు హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ప్రసంగిస్తుండగా.. ఈలలు, కేకలు వేస్తూ ఆయన వేదిక దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో మాధవ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించి వెనుదిరిగారు.
అవి'తానాసభలు' కాదు 'టీడీపీ భజనసభలు'
— Kanna Lakshmi Narayana (@klnbjp) July 8, 2019
పచ్చతమ్ముళ్లు అమెరికాలో కూడా తెలుగువాళ్ళ ప్రతిష్ట దిగజారుస్తున్నారు.
రాంమాధవ్ గారిని ఆహ్వానించి ఆయన జాతీయవాద ప్రసంగానికి అడ్డుతగిలి అవమానించి లోకేష్ గ్యాంగ్ మరోసారి తమ నీచబుద్ది బయటపెట్టారు.
ఏపీలో మీబురద రాజకీయాల్లో నుండే కమలవికాసం జరుగుతుంది pic.twitter.com/SsEkmXA9qt