Asianet News TeluguAsianet News Telugu

గ్యాస్ లీకేజీ వల్ల ఆరుగురి మృతికి కారణమైన పరిశ్రమకు జెసి వత్తాసు (వీడియో)

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఏదీ దాచుకోరు. తనకు ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తుంటారు. గరుడ స్టీల్ ప్లాంట్ ను సమర్థిస్తూ ఆయన మాట్లాడారు. ఈ ప్లాంట్ లో గ్యాస్ లీకేజీ కారణంగా ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఎవరి తప్పూ లేదని కితాబు ఇచ్చారు.

Annatapur MP JC Diwakar Reddy supporting the Garuda Steel plant in poisonous gas leakage incident

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఓ ఉక్కు ఫ్యాక్టరీలో గురువారం నాడు గ్యాస్ లీకై  ఆరుగురు మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

విషవాయువులు బయటకు వెళ్లాల్సిన ప్రాంతంలో గ్యాస్  లీకైంది. 15 మంది స్పృహ తప్పిపోయారు. ఈ విషయాన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే విషవాయులు ఎలా బయటకు లీకయ్యాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

                           "

Follow Us:
Download App:
  • android
  • ios