Asianet News TeluguAsianet News Telugu

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించిన ఏపీపీఎస్సీ

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. డిసెంబర్ 12 నుంచి 23 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఏడు పేపర్లుగా నిర్వహిస్తామని తెలిపింది

andhra pradesh public service commission has released group 1 mains exam 2019 schedule
Author
Amaravathi, First Published Jul 4, 2019, 5:26 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. డిసెంబర్ 12 నుంచి 23 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఏడు పేపర్లుగా నిర్వహిస్తామని తెలిపింది. డిసెంబర్ 12, 13, 15, 17, 19, 21, 23 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి మే 26న గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్‌ను ఏపీపీఎస్సీ నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,14,473 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా... వీరిలో పేపర్-1 (జనరల్ స్టడీస్)కు 59,697 మంది, పేపర్-2 (జనరల్ ఆప్టిట్యూడ్) పరీక్షకు 59,200 మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios