ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం: కీలక అంశాలపై చర్చ
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు ప్రారంభమైంది. కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
అమరావతి: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు ప్రారంభమైంది. కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన రెండో విడత జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.ఈ పథకం కింద అర్హులైన తల్లులకు రూ. 15 వేల చొప్పున ఇవ్వనున్నారు.ఈ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈ ఏడాది జనవరి 9వ తేదీన తొలి విడత నిధులను ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక పాలసీని కేబినెట్ ఆమోదించనుంది. ఆరు జిల్లాల్లో వాటర్ షెడ్ ల అభివృద్ధి పథకం అమలుపై కేబినెట్ చర్చించనుంది. సర్వే, బౌండరీ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
రైతు భరోసా మరో విడత చెల్లింపులపై చర్చించే అవకాశం ఉంది..రైతు భరోసాతో పాటు పశువుల ఆరోగ్య పరీక్షల ల్యాబ్ ల ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై కూడ చర్చించనున్నారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములు ఇచ్చిన వారికి పరిహారం చెల్లింపు విషయమై కేబినెట్ లో చర్చించే అవకాశం లేకపోలేదు.