Asianet News TeluguAsianet News Telugu

విభజన నష్టాలపై 29న సమావేశం: నో చెప్పిన జగన్, స్పందించని బాబు

రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఈ నెల 29వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.

All party meeting on loss meeted out to AP in bifurcation
Author
Kakinada, First Published Jan 25, 2019, 12:10 PM IST

కాకినాడ: రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఈ నెల 29వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెసు చెప్పిందని ఆయన అన్నారు.

తమ ఆహ్వానంపై తెలుగుదేశం పార్టీ ఇంకా స్పందించలేదని ఆయన శుక్రవారం మీడియాతో చెప్పారు. ఇతర రాజకీయ పార్టీలు ఈ సమావేశంలో పాల్గొంటాయని ఆయన చెప్పారు. జనసేన, వామపక్షాలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెసు కూడా పాల్గొనే అవకాశం ఉంది.

ఇదిలావుంటే, విభజన హామీలపై ఫిబ్రవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ జరగనుంది. ఈ బంద్ కు ఇప్పటికే కాంగ్రెసు పార్టీ తన మద్దతు ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios