అనంతపురం జిల్లాలో (anantapur district) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఈ  ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతులను ఉరవకొండ మండలం నిమ్మగల్లు వాసులుగా గుర్తించారు. 

అనంతపురం జిల్లాలో (anantapur district) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఆదివారం సాయంత్రం ఉరవకొండ మండలం (uravakonda) బుదగవిలో లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. కర్ణాటకలోని బళ్లారిలో (bellary) పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను ఉరవకొండ మండలం నిమ్మగల్లు వాసులుగా గుర్తించారు. మృతులంతా కుటుంబ సభ్యులు, బంధువులుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred