తూర్పుగోదావరి (east godavari district) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ జీలుగ కల్లు (illicit kallu) తాగి ఐదుగురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తూర్పుగోదావరి (east godavari district) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ జీలుగ కల్లు (illicit kallu) తాగి ఐదుగురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని కల్లు శాంపిల్స్ సేకరించారు. ఒకేసారి ఐదుగురు గ్రామస్తులు మరణించడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred