అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

By narsimha lodeFirst Published Sep 15, 2019, 6:26 PM IST
Highlights

వరంగల్ జిల్లాకు చెందిన 9 మంది ఆచూకీ బోటు ప్రమాదంలో గల్లంతయ్యారు. ఐదుగురు మాత్రం సురక్షితంగా బయటకు వచ్చారు. 

వరంగల్: మా నాన్న ఇవాళ ఉదయం ఫోన్ చేశాడు. రేపు ఉదయమే వరంగల్ కు వస్తానని ఫోన్ చేశాడు. కానీ తమ తండ్రి ఫోన్ పనిచేయడం లేదని బోస్క రాజేందర్ కూతురు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

ఆదివారం నాడు ఆమె తెలుగు న్యూస్ ఛానెల్స్ తో ఆమె మాట్లాడారు. పాపికొండలకు బయలుదేరే ముందు ఫోన్లో మాట్లాడినట్టుగా ఆమె చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన సమయం తెలిసి టీవీల్లో చూస్తే మా నాన్న కన్పించడం లేదని ఆమె కన్నీరు మున్నీరయ్యారు.

తన తండ్రికి  పోన్ చేసినా కూడ ఫోన్ పనిచేయడం లేదని ఆమె చెప్పారు. మరో వైపు ఇదే జిల్లాకు చెందిన అవినాష్ అనే యువకుడు కూడ ఆచూకీ కన్పించడం లేదని అవినాష్ తల్లి  చెబుతోంది. ఆదివారం నాడు ఉదయం తన కొడుకు ఫోన్ చేసినట్టుగా ఆమె చెప్పారు.

పాపికొండలుకు వెళ్లిన తర్వాత ఫోన్ పనిచేయదు.  పాపికొండల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తానని అవినాష్ చెప్పినట్టుగా అవినాష్ తల్లి గుర్తు చేసుకొన్నారు. కానీ,  తన కొడుకు ఫోన్ పనిచేయడం లేదని అవినాష్ తల్లి చెప్పారు.

సంబంధిత వార్తలు

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

 

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

 

click me!