video : స్కూలు బస్సును ఢీ కొట్టిన లారీ, తప్పిన ప్రమాదం

Oct 21, 2019, 4:20 PM IST

కృష్ణాజిల్లా, అవుటపల్లి వద్ద స్కూలు బస్సును లారీ ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది విద్యార్థులున్నారు. గన్నవరం రవీంద్రభారతి స్కూల్ బస్సును అవుటపల్లి వద్ద ఓ లారీ వెనకనుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు వెనకభాగం దెబ్బతిన్నది. బస్సు అద్దాలు విరిగిపోయాయి. అయితే బస్సులోని విద్యార్థులకు ఎలాంటి గాయాలూ కాలేదు.